हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

News telugu: Kerala: వేగంగా వ్యాపిస్తున్న అమీబా కేసులు.. 19 మంది మృతి

Sharanya
News telugu: Kerala: వేగంగా వ్యాపిస్తున్న అమీబా కేసులు.. 19 మంది మృతి

కేరళలో మెదడును ప్రభావితం చేసే అరుదైన వ్యాధి – నేగ్లేరియా ఫౌలేరి (Naegleria fowleri) అనే అమీబా సోకడంతో మరణాలు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 19 మంది మరణించగా, 67 మందికి ఇన్ఫెక్షన్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలోని ఆరోగ్య శాఖ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. పొరుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి.

ఈ అమీబా ఎలా వ్యాపిస్తుంది?

నేగ్లేరియా ఫౌలేరి అమీబా (amoeba)సాధారణంగా చెరువులు, సరస్సులు, నిల్వ నీటి వనరులు వంటి ప్రదేశాల్లో పెరుగుతుంది. ఈ నీటిలో ఈత కొట్టినపుడు, ఈ అమీబా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి మెదడును చేరుతుంది. మెదడులోకి ప్రవేశించిన తర్వాత ఇది కేంద్ర నాడీ వ్యవస్థను దెబ్బతీసి తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ను కలిగిస్తుంది. చికిత్స ఆలస్యమైతే మృతి కూడా సంభవించే ప్రమాదం ఉంది.

News telugu
News telugu

లక్షణాలు ఏమిటి?

ఈ ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత 1 నుండి 9 రోజుల లోపల కింది లక్షణాలు కనిపించవచ్చు:

  • తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు, మెడ కట్టినట్టుగా ఉండటం, మానసిక స్థితిలో మార్పులు, కోమాలోకి వెళ్లే అవకాశం కూడా ఉంది

చికిత్స ఉంటుందా?

ఈ వ్యాధికి ప్రత్యేకమైన చికిత్స పరిమితంగా ఉన్నప్పటికీ, తొందరగా గుర్తించి వైద్య సేవలు అందిస్తే కొన్ని సందర్భాల్లో కోలుకోవచ్చు. కాని ఇది అత్యంత వేగంగా వ్యాపించే ఇన్ఫెక్షన్ కాబట్టి, ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఈ అమీబా సోకకుండా ఉండేందుకు ప్రజలు కింద పేర్కొన్న జాగ్రత్తలు తీసుకోవాలి:

  • చెరువులు, సరస్సులు లేదా నిల్వ నీటిలో ఈతకు వెళ్లకూడదు.
  • తప్పనిసరిగా ఈత కొట్టాల్సినప్పుడు నోస్ క్లిప్ (ముక్కుకు బిగించే క్లిప్) వాడాలి.
  • బావులు, నీటి ట్యాంకులు వంటి వాటిని క్లోరిన్ ఉపయోగించి నియమితంగా శుభ్రపరచాలి.
  • నిల్వ నీటిని తాకిన తర్వాత తలనొప్పి, జ్వరం వంటి లక్షణాలు ఉన్నప్పుడు తక్షణమే వైద్యుని సంప్రదించాలి.

ప్రజలతో అధికారుల విజ్ఞప్తి

కేరళ ఆరోగ్య శాఖ అధికారులు మరియు వైద్య నిపుణులు ప్రజలను జాగ్రత్తగా ఉండాలని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, అధికారికంగా ఇచ్చే సమాచారం మేరకు only చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/white-house-clarifies-h1b-visa-fees/international/551455/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870