తమిళనాడులోని కరూర్లో (Karur stampede) జరిగిన తొక్కిసలాట ఘటనలో భర్తను కోల్పోయిన ఓ మహిళ టీవీకే అధినేత, నటుడు విజయ్ తీరును తీవ్రంగా తప్పుబట్టింది.. సెప్టెంబర్ 27న టీవీకే అధినేత, సినీ నటుడు విజయ్ నిర్వహించిన సభలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో రమేశ్ అనే వ్యక్తి కూడా ఒకరు. ఇప్పుడు అతడి భార్య చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారాయి.
Read Also: Weather Red Alert : మోంతా తుపాను దెబ్బకు ఆంధ్ర, తెలంగాణలో భారీ వర్షాలు
తమకు డబ్బు ముఖ్యం కాదని చెబుతూ విజయ్ తమ ఖాతాలో జమ చేసిన రూ.20 లక్షలను తిప్పి పంపించింది. విజయ్ నుంచి తాము ఓదార్పు కోరుకున్నాం తప్ప డబ్బు కాదని చెప్పారు.తొక్కిసలాట జరిగిన కొద్ది రోజులకు విజయ్ తమతో వీడియో కాల్ లో మాట్లాడారని రమేశ్ భార్య సంఘవి తెలిపారు.
నేరుగా వచ్చి పరామర్శిస్తానని, ముందుగా పరిహారం తీసుకోవాలని విజయ్ (Vijay) కోరారన్నారు. ఈ నెల 18న తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ తరఫున తమ బ్యాంకు ఖాతాలో రూ.20 లక్షలు జమ అయిందని వివరించారు.

విజయ్ పరామర్శ కోసం ఎదురుచూశామని
అయితే, తమకు డబ్బు ముఖ్యం కాదని, విజయ్ పరామర్శ కోసం ఎదురుచూశామని సంఘవి చెప్పారు.తాజాగా కరూర్ తొక్కిసలాట (Karur stampede) బాధిత కుటుంబాలను విజయ్ చెన్నై (Chennai) కి పిలిపించుకుని ఓ రిసార్ట్ లో సమావేశమయ్యారని సంఘవి గుర్తుచేశారు. ఆ సమావేశానికి తాము వెళ్లలేదని, తమ పేరు చెప్పుకుని తమ బంధువులు వెళ్లారని సంఘవి ఆరోపించారు.
విజయ్ పరామర్శిస్తారని భావిస్తే డబ్బు పంపారని, ఆ డబ్బు తమకు అక్కర్లేదని తిప్పి పంపామని సంఘవి వివరించారు. డబ్బు తిప్పి పంపిన రశీదును ఆమె మీడియాకు చూపించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: