हिन्दी | Epaper

Telugu News: Karur Stampede:విజయ్ ను వెంటాడుతున్న బాంబు బెదిరింపులు

Pooja
Telugu News: Karur Stampede:విజయ్ ను వెంటాడుతున్న బాంబు బెదిరింపులు

టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించక ముందే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఆయన నిర్వహించిన రోడ్‌షో (Karur Stampede) ఒక విషాద ఘటనకు దారితీసింది. ఆ సంఘటన తర్వాత ఆయనకు వరుసగా బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా చెన్నైలోని నీలంకరైలో ఉన్న విజయ్ నివాసానికి బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. ఒక అజ్ఞాత వ్యక్తి చెన్నై పోలీసులకు ఫోన్‌ చేసి, విజయ్ భవిష్యత్తులో మళ్లీ ర్యాలీలు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించాడు.

Read Also: Today Gold Rate 10/10/2025 : బంగారం ధరలు ఇవాళ్టి పరిస్థితి అక్టోబర్ 10, శుక్రవారం

Karur Stampede

వరుస బెదిరింపులతో టీవీకే అధినేత విజయ్ ఆందోళనలో

ఈ కాల్‌ అందిన వెంటనే పోలీసులు అప్రమత్తమై, విజయ్ఇం(Vijay)టి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అదే సమయంలో ఫోన్‌ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రత్యేక బృందం దర్యాప్తు ప్రారంభించింది. ఆ కాల్‌ తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో నుంచి వచ్చిందని పోలీసులు గుర్తించారు. నిందితుడిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెబుతున్నారు.

ఇది విజయ్‌కు వచ్చిన మూడో బెదిరింపు కాల్‌గా పోలీసులు వెల్లడించారు. ఈ బెదిరింపులు కరూర్‌ ఘటన(Karur Stampede) తర్వాతే పెరిగినట్టు తెలుస్తోంది. ఇటీవల బాంబు బెదిరింపులు రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. విజయ్‌తో పాటు సీఎం ఎంకే స్టాలిన్‌, సినీ నటీమణులు త్రిష, నయనతారల ఇళ్లకూ ఇలాంటి కాల్స్‌ వచ్చాయి.

కరూర్‌ రోడ్‌షోలో విషాదం – 41 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన

తమిళనాడులోని కరూర్‌లో విజయ్ నిర్వహించిన రోడ్‌షోలో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

అధికారుల ప్రకారం, పదివేల మందికి సరిపడే ప్రదేశంలో లక్ష మందికి పైగా చేరుకోవడంతో తొక్కిసలాట చోటు చేసుకుందని తెలిపారు. పరిస్థితి విషమించడంతో విజయ్ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపి, గాయపడిన వారికి నీళ్లు అందించారు. పెద్ద సంఖ్యలో అంబులెన్సులు అక్కడికి చేరడంలో ఆలస్యం కావడం వల్ల మృతుల సంఖ్య పెరిగింది. మరణించిన వారిలో పార్టీ కార్యకర్తలతో పాటు ఆరుగురు చిన్నారులు ఉన్నారు.

విజయ్ ఇంటికి వచ్చిన బాంబు బెదిరింపు ఎక్కడి నుంచి వచ్చింది?
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో నుంచి ఈ బెదిరింపు కాల్‌ వచ్చినట్టు పోలీసులు గుర్తించారు.

విజయ్‌కు ఇలాంటి బెదిరింపులు ఇంతకుముందు వచ్చాయా?
అవును, ఇది విజయ్‌కు వచ్చిన మూడో బెదిరింపు కాల్‌.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రుతుస్రావ సెలవులు చట్టం చేస్తే మహిళ ఉపాధికే అడ్డంకి: సుప్రీంకోర్టు

రుతుస్రావ సెలవులు చట్టం చేస్తే మహిళ ఉపాధికే అడ్డంకి: సుప్రీంకోర్టు

చైనా పెట్టుబడులకు భారత్ పచ్చజెండా

చైనా పెట్టుబడులకు భారత్ పచ్చజెండా

తిరుమల లడ్డూ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

తిరుమల లడ్డూ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

ఏనుగు బీభత్సం.. వ్యక్తి మృతి!
0:51

ఏనుగు బీభత్సం.. వ్యక్తి మృతి!

100 డాలర్ల దిగువకు చేరిన బ్యారెల్!.. రష్యా ఆయిల్‌పై అమెరికా కీలక నిర్ణయం!

100 డాలర్ల దిగువకు చేరిన బ్యారెల్!.. రష్యా ఆయిల్‌పై అమెరికా కీలక నిర్ణయం!

వార్నీ.. ఇదెక్కడి విడ్డూరం! ఇడ్లీ తింటే గ్యాస్ బిల్లు కూడా మనమే కట్టాలా?

వార్నీ.. ఇదెక్కడి విడ్డూరం! ఇడ్లీ తింటే గ్యాస్ బిల్లు కూడా మనమే కట్టాలా?

ఇరాన్ యుద్ధంతో పనామా కాలువకు పెరిగిన ట్రాఫిక్‌

ఇరాన్ యుద్ధంతో పనామా కాలువకు పెరిగిన ట్రాఫిక్‌

7 రూపాయల నుంచి 4 రూపాయలకు పడిపోయిన గుడ్డు ధరలు

7 రూపాయల నుంచి 4 రూపాయలకు పడిపోయిన గుడ్డు ధరలు

అడోబ్ సీఈవో శాంతను నారాయణ్ ఎందుకని తప్పుకున్నారు?

అడోబ్ సీఈవో శాంతను నారాయణ్ ఎందుకని తప్పుకున్నారు?

పెరిగిన వంట నూనె ధరలు

పెరిగిన వంట నూనె ధరలు

యుద్ధంతో వంటగదిలో కిరోసిన్ సెగ

యుద్ధంతో వంటగదిలో కిరోసిన్ సెగ

అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!

అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!

📢 For Advertisement Booking: 98481 12870