
Kakinada: కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో సభ్యసమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. కట్టుకున్న భార్య అని చూడకుండా, సమాజంలో గౌరవప్రదమైన కానిస్టేబుల్ ఉద్యోగంలో ఉన్న మహిళపై భర్త నడిరోడ్డుపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. రెండో పెళ్లి చేసుకునేందుకు అంగీకరించలేదన్న కోపంతో నడిరోడ్డుపై ఆమెను కిందపడేసి విచక్షణారహితంగా కొట్టాడు.
Read Also: Telangana: ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు..స్పీకర్ నిర్ణయానికే సుప్రీంకోర్టు మొగ్గు
సామర్లకోట మండలం పీ. వేమవరానికి చెందిన మణికంఠ, దేవి 2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు. దేవి ఎక్సైజ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. అయితే, తన మేనకోడలిని రెండో పెళ్లి చేసుకోవాలని మణికంఠ నిర్ణయించుకున్నాడు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య కొంతకాలంగా తరచూ గొడవలు జరుగుతున్నాయి.
తాజాగా రెండో పెళ్లి విషయంపై మరోసారి వీరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన మణికంఠ, భార్య దేవిని రోడ్డుపై కిందపడేసి దారుణంగా కొట్టాడు. భర్త వేధింపులు భరించలేకపోయిన ఆమె, తనకు న్యాయం చేయాలంటూ సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: