Jio, Airtel Customers Shocked as ₹249 Plan Discontinued
Jio VS Airtel Shock : దేశంలో టెలికాం రంగంలో పెద్ద షాక్ వచ్చింది. ప్రముఖ కంపెనీలు రిలయన్స్ జియో మరియు భారతీ ఎయిర్టెల్ తమ బేసిక్ ₹249 ప్రీపెయిడ్ ప్లాన్ను నిలిపివేశాయి. ఈ ప్లాన్లో రోజుకు 1GB డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలు, 24 రోజుల వాలిడిటీ ఉండేది. తక్కువ కాలానికి, (Jio vs Airtel Shock) తక్కువ ఖర్చుతో రీఛార్జ్ కావాలనుకునే కస్టమర్లకు ఇది ఒక “ఎంట్రీ లెవల్ ప్లాన్” గా ఉపయోగపడేది.
ఎయిర్టెల్ Airtel Thanks యాప్ ద్వారా ఆగస్టు 20, 2025 నుండి ఈ ప్లాన్ అందుబాటులో ఉండదని అధికారికంగా ప్రకటించింది. అదే విధంగా, జియో కూడా తన ₹209 (22 రోజులు) మరియు ₹249 (28 రోజులు) ప్లాన్లను సడన్గా తొలగించింది. దీంతో జియో బేస్ టారిఫ్ లెవెల్ ఇప్పుడు ₹299 నుండి మొదలవుతోంది. అంటే, కనీసం ₹299 రీఛార్జ్ చేస్తేనే కస్టమర్కి డేటా + కాలింగ్ ప్యాక్ లభిస్తుంది.
ఈ మార్పుతో చిన్న నగరాల్లో
ముఖ్యంగా స్టూడెంట్స్ ఎక్కువగా ఉపయోగించే షార్ట్-టర్మ్ రీఛార్జ్ ఆప్షన్ పోయింది. ఇప్పుడు టెలికాం కంపెనీలు వినియోగదారులను ఎక్కువ డేటా లేదా OTT సబ్స్క్రిప్షన్లతో కూడిన ప్రీమియం ప్లాన్ల వైపు మళ్లిస్తున్నాయి.
ఇక ఎయిర్టెల్ సర్వీసుల్లో ఇటీవల ఒక పెద్ద అంతరాయం కూడా ఏర్పడింది. Airtel Thanks యాప్ పనిచేయకపోవడం, కాల్స్, డేటా సమస్యలతో వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. డౌన్డిటెక్టర్ ప్లాట్ఫామ్లో ఒక్కసారిగా 3,500కి పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి.
Read also: