జేఈఈ మెయిన్–2026(JEE Mains 2026) పరీక్ష ఈసారి విద్యార్థులకు మరింత చేరువగా మారబోతోంది. దేశవ్యాప్తంగా పరీక్షా కేంద్రాల సంఖ్యను గణనీయంగా పెంచుతూ, జాతీయ పరీక్షల సంస్థ (NTA) కొత్త మార్పులను ప్రకటించింది. దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, ఈసారి ఆ సంఖ్యను ఇంకా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం కొత్త ఆన్లైన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
Read Also: AP: ఆయూష్ విభాగంలో 107 పోస్టులకు దరఖాస్తులు

ఏపీ, తెలంగాణలో కొత్త సెంటర్లు
ఈసారి ఆంధ్రప్రదేశ్లో 8, తెలంగాణలో 3 కొత్త పట్టణాలను(JEE Mains 2026) జోడించారు. హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాల, మహబూబ్నగర్, సూర్యాపేట, వరంగల్, సిద్దిపేట, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, కొత్తగూడెం వంటి పాత కేంద్రాలకు తోడు ఆదిలాబాద్, పెద్దపల్లి, కోదాడ కొత్తగా చేర్చబడ్డాయి. దీంతో తెలంగాణలో మొత్తం 14 పరీక్షా కేంద్రాలు అందుబాటులోకి వస్తున్నాయి.
పరీక్షలో కొత్త ఫీచర్లు
ఈసారి వర్చువల్ కాలిక్యూలేటర్ సదుపాయం కూడా పరీక్షలో భాగమవుతుంది. ఇది కంప్యూటర్ స్క్రీన్పైనే అందుబాటులో ఉంటుంది. దీని వలన విద్యార్థులు సమయాన్ని ఆదా చేసుకోగలరని జేఈఈ నిపుణులు తెలిపారు. అదనంగా ప్రశ్నపత్రం ఫాంట్ సైజు, ఇమేజ్లను పెంచి చూడగల అవకాశమూ ఇవ్వబడుతోంది.
నోటిఫికేషన్ అర్ధరాత్రి విడుదల
ఎన్టీఏ శుక్రవారం అర్ధరాత్రి నోటిఫికేషన్ విడుదల చేసింది. అదే రాత్రి నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొంది. ఈ విధానం విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోందని విద్యా నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
తొలి విడత షెడ్యూల్
- దరఖాస్తుల స్వీకరణ: నవంబర్ 27 వరకు
- పరీక్షా కేంద్రాల వివరాలు: జనవరి మొదటి వారం
- పరీక్ష తేదీలు: జనవరి 21 – 30
- ఫలితాలు: ఫిబ్రవరి 12 నాటికి
చివరి విడత వివరాలు
- దరఖాస్తులు: జనవరి చివరి వారం నుండి
- పరీక్షలు: ఏప్రిల్ 2 – 9 మధ్య
- ఫలితాలు: ఏప్రిల్ 20 నాటికి
పరీక్ష ముఖ్యాంశాలు
- 2024, 2025, 2026 ఇంటర్ విద్యార్థులు అర్హులు.
- రోజుకు రెండు షిఫ్టులు – ఉదయం 9 నుంచి 12, మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు.
- పరీక్ష 13 భాషల్లో (తెలుగు, ఆంగ్లం సహా) నిర్వహిస్తారు.
- పేపర్-1: 300 మార్కులు, పేపర్-2: 400 మార్కులు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: