మృతులకు హోంమంత్రి అమిత్ నివాళి
Jammu Kashmir : జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన భీకర ఉగ్రదాడి నేపథ్యంగా భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ దాడి అనంతరం, ప్రధాని నరేంద్ర మోడీ కేంద్రమంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించి, భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. ఉగ్రవాదులను పటిష్టంగా ఎదుర్కొనేందుకు గాలింపు చర్యలు మొదలయ్యాయి.కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యాటకుల భద్రత కోసం శ్రీనగర్ నుంచి ప్రత్యేక విమాన సర్వీసులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. నాలుగు ప్రత్యేక విమానాలు శ్రీనగర్ నుంచి ఢిల్లీ, ముంబయికి వెళ్లనున్నాయి. ఈ మేరకు హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడి, అవసరమైతే మరిన్ని విమానాలను నడపాలని నిర్ణయించుకున్నారు. విమానయాన సంస్థలతో సమావేశం నిర్వహించి, ప్రయాణికులపై భారం పడకుండా సాధారణ ఛార్జీలను మాత్రమే వసూలు చేయాలని ఆదేశించారు.మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయంతో పూర్తి సహకారం అందించాలని కోరారు. జమ్ముకశ్మీర్ ప్రభుత్వం పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మృతిచెందిన వ్యక్తుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.

Jammu Kashmir : ఉగ్రదాడికి ప్రభుత్వం కౌంటర్ చర్యలు – భద్రతా వ్యవస్థ మరింత కట్టుదిట్టం
ఈ ఘటనలో మరణించిన వారికి నివాళి అర్పించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా శ్రీనగర్ చేరుకున్నారు. పుష్పగుచ్ఛాలతో శ్రద్ధాంజలి ఘటించిన ఆయన, ఉగ్రవాద దాడిలో మరణించిన రెండు వ్యక్తులు కర్ణాటకకు చెందినవారనిఅని ఆ రాష్ట్ర ప్రభుత్వం ధ్రువీకరించింది.ప్రస్తుతం, పహల్గాంలో చిక్కుకున్న గోవాకు చెందిన 50 మందికి పైగా పర్యాటకులు శ్రీనగర్ హోటళ్లలో ఉన్నారు. వారిని తిరిగి తీసుకురావడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన భీకర ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదనను కలిగించింది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీనగర్ చేరుకొని నివాళి అర్పించారు. పుష్పగుచ్ఛాలతో శ్రద్ధాంజలి ఘటించిన ఆయన, ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఉగ్రదాడిలో మరణించిన వారు కర్ణాటకకు చెందిన వ్యక్తులని ఆ రాష్ట్ర ప్రభుత్వం ధృవీకరించింది.
Read More : Terror Attack : పాక్పై భారత్ ప్రతీకారం.. సింధూ జలాల ఒప్పందం రద్దు.. అటారీ-వాఘ సరిహద్దును మూసివేత