Latest News: Jai Anmol Ambani: అనిల్ అంబానీ కుమారుడిపై క్రిమినల్ కేసు

Read Time:  1 min
Jai Anmol Ambani
Jai Anmol Ambani
FONT SIZE
GET APP

ప్రముఖ పారిశ్రామికవేత్త(Jai Anmol Ambani) అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అంబానీపై సీబీఐ(CBI) క్రిమినల్ కేసు నమోదు చేసింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు సంబంధించిన భారీ బ్యాంకింగ్ మోసానికి ఆయనే సహా అధికారులు కారణమయ్యారని ఆరోపణలు వచ్చాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన అధికారిక ఫిర్యాదు ఆధారంగా సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో జై అన్మోల్‌తో పాటు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, మాజీ సీఈఓ రవీంద్ర సుధాల్కర్ నిందితులుగా ఉన్నారు. ఫిర్యాదు ప్రకారం, కంపెనీ వ్యాపార కార్యకలాపాల కోసం యూనియన్ బ్యాంక్ రూ.450 కోట్ల వరకు రుణం మంజూరు చేసింది. అయితే, రుణ వాయిదాలను చెల్లించకపోవడంతో 2019 సెప్టెంబర్ నాటికి ఈ ఖాతా ఎన్‌పీఎగా మారింది. దీనిపై అనుమానం వ్యక్తం చేసిన బ్యాంక్, ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టగా, కంపెనీ రుణంగా తీసుకున్న నిధులను ఇతర అవసరాలకు దారి మళ్లించినట్లు గ్రాంట్ థార్న్‌టన్ నివేదికలో వెల్లడైంది.

Read also: వందేమాతరం మాట్లాడిన వారిని ఇందిరా గాంధీ జైలులో పెట్టారు: అమిత్ షా

Jai Anmol Ambani
Jai Anmol Ambani Criminal case against Anil Ambani’s son

ఫోరెన్సిక్ ఆడిట్‌లో వెల్లడి నిధుల దుర్వినియోగం స్పష్టం

ఫోరెన్సిక్(Jai Anmol Ambani) పరిశీలన ప్రకారం నిందితులు కంపెనీ నిధులను తనిఖీలకు అందుబాటులో లేని మార్గాల్లో వినియోగించి, ఖాతాల వివరాలను మార్చి, బ్యాంకుకు భారీ నష్టం కలిగించారని తేలింది. మొత్తంగా రూ.228.06 కోట్ల నష్టానికి ఈ అక్రమాలు కారణమయ్యాయని ఎఫ్‌ఐఆర్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. సీబీఐ అధికారులు త్వరలోనే కంపెనీ ఆర్థిక పత్రాలు, లావాదేవీలు, లోన్ అకౌంట్ రికార్డులను సేకరిస్తారు. తదుపరి దర్యాప్తులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అనిల్ అంబానీ కుటుంబానికి ఇది తొలి క్రిమినల్ కేసు కావడం గమనార్హం. ఈ కేసు ఆర్థిక రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.