हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

India : మరో సంచలన నిర్ణయం దిశగా భారత్?

Sudheer
India : మరో సంచలన నిర్ణయం దిశగా భారత్?

పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత పాకిస్థాన్‌పై ఆగ్రహంగా ఉన్న భారత్, ఇప్పటికే పలు దౌత్య చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు నేషనల్ మీడియా వర్గాలు వెల్లడించాయి. 2021 ఫిబ్రవరి 24న అమల్లోకి వచ్చిన భారత్–పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేయాలని కేంద్రం యోచనలో ఉంది. ఈ నిర్ణయం తీసుకుంటే, సరిహద్దుల్లో భారత సైన్యానికి మరింత స్వేచ్ఛ కలగనుంది.

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నట్టు రక్షణ శాఖ నివేదిక

ఇటీవల కాలంలో పాకిస్థాన్ ఆర్మీ తరచూ కాల్పులకు పాల్పడుతూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నట్టు రక్షణ శాఖ నివేదికలు వెల్లడించాయి. అలాగే, ఉగ్రవాద సంస్థలు కశ్మీర్‌లోకి చొరబడి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ పరిస్థితుల్లో ఒప్పందాన్ని కొనసాగించడం మన జవాన్లకు అడ్డంకిగా మారుతుందని కేంద్రం భావిస్తోంది. దీంతో ఈ ఒప్పందాన్ని రద్దు చేసి, భారత్ సైనిక బలగాలకు కౌంటర్ చర్యలు తీసుకునే వెసులుబాటు కల్పించాలనే నిర్ణయానికి రావచ్చు.

దేశ భద్రత, జవాన్ల ప్రాణాల పరిరక్షణే ప్రాధాన్యం

ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతను మరింత పెంచే అవకాశం ఉంది. భారత్ తీసుకునే ఈ చర్య అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశంగా మారనుంది. దేశ భద్రత, జవాన్ల ప్రాణాల పరిరక్షణే ప్రాధాన్యం అనే సందేశంతో కేంద్రం ఈ దిశగా కదులుతున్నట్లు తెలుస్తోంది. గతంలో సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్‌లతో భారత్ తన స్థైర్యాన్ని ఇప్పటికే చాటిందని విశ్లేషకులు గుర్తిస్తున్నారు. తాజా నిర్ణయం కూడా అదే రీతిలో కఠినమైన విధానానికి సంకేతమని భావిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870