cigarette price hike india : దేశంలో పొగాకు వినియోగాన్ని నియంత్రించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1, 2026 నుంచి సిగరెట్లు సహా అన్ని పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ డ్యూటీ విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల మంది సిగరెట్ వినియోగదారులపై భారం పెరగనుంది.
చ్యూయింగ్ టొబాకో, జర్దా సెంటెడ్ టొబాకో, గుట్కా తయారీ యంత్రాలకు సంబంధించిన 2026 నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేసింది. దీని ప్రకారం, సిగరెట్ పొడవును బట్టి ప్రతి వెయ్యి సిగరెట్లపై రూ.2,050 నుంచి రూ.8,500 వరకు ఎక్సైజ్ డ్యూటీ వసూలు చేయనున్నారు.
Read also: Cigarette price hike : సిగరెట్ ధరలు భారీగా పెంపు సెంట్రల్ ఎక్సైజ్ బిల్లు 2025కి ఆమోదం
షేర్ మార్కెట్పై ప్రభావం
ఈ ప్రకటనతో సిగరెట్ తయారీ కంపెనీల షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. ఐటీసీ, గాడ్ఫ్రే ఫిలిప్స్ వంటి ప్రధాన కంపెనీల షేర్లు 8 శాతం వరకు నష్టపోయాయి. మార్కెట్ లీడర్ ఐటీసీ షేరు 2 శాతం తగ్గగా, మార్లబరో సిగరెట్లను విక్రయించే గాడ్ఫ్రే ఫిలిప్స్ షేరు 4 శాతం కంటే ఎక్కువగా పడిపోయింది.
జీఎస్టీకి అదనంగా ఎక్సైజ్ డ్యూటీ
ప్రస్తుతం పొగాకు ఉత్పత్తులపై అమలులో (cigarette price hike india) ఉన్న 40 శాతం జీఎస్టీకి అదనంగా ఈ ఎక్సైజ్ డ్యూటీ విధించనున్నారు. జీఎస్టీ పరిహార సెస్సును రద్దు చేసి, దాని స్థానంలో హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్సును అమలు చేయనున్నారు. అయితే బీడీలపై మాత్రం 18 శాతం జీఎస్టీ మాత్రమే కొనసాగనుంది.
డిసెంబర్లో పార్లమెంట్ ఆమోదం పొందిన రెండు బిల్లుల ఆధారంగా ఈ కొత్త పన్ను విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రజారోగ్య పరిరక్షణతో పాటు జీఎస్టీ వ్యవస్థ సరళీకరణే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా ప్రభుత్వం చెబుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: