Latest Telugu news : Himanta Biswa Sarma- ముగ్గురు విదేశీయుల‌కే పౌర‌స‌త్వం క‌ల్పించాం: అస్సాం సీఎం

Read Time:  1 min
CM Himanta Biswa Sarma- ముగ్గురు విదేశీయుల‌కే పౌర‌స‌త్వం క‌ల్పించాం: అస్సాం సీఎం
CM Himanta Biswa Sarma- ముగ్గురు విదేశీయుల‌కే పౌర‌స‌త్వం క‌ల్పించాం: అస్సాం సీఎం
FONT SIZE
GET APP

అస్సాంలో కేవ‌లం ముగ్గురు విదేశీయుల‌కు మాత్ర‌మే పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ‌ చ‌ట్టం 2019 కింద భార‌తీయ పౌర‌స‌త్వాన్ని క‌ల్పించిన‌ట్లు సీఎం హిమంత బిశ్వ శ‌ర్మ (Himanta Biswa Sarma) తెలిపారు. మొత్తం 12 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా, దాంట్లో ముగ్గురికే పౌర‌స‌త్వం ఇచ్చిన‌ట్లు చెప్పారు. సీఏఏ ద్వారా ల‌క్ష‌ల సంఖ్య‌లో విదేశీయులు పౌర‌స‌త్వం పొందే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్న నేప‌థ్యంలో అస్సాం సీఎం (Himanta Biswa Sarma)ఈ వ్యాఖ్య‌లు చేశారు.పౌర‌స‌త్వం (citizenship) కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న మ‌రో 9 మంది అంశం ప‌ర్య‌శీలిన‌లో ఉన్న‌ట్లు సీఎం వెల్ల‌డించారు. సుమారు 20 నుంచి 25 ల‌క్ష‌ల మందికి అస్సాంలో పౌర‌స‌త్వం ఇస్తార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయ‌ని, కానీ ఇప్ప‌టికి 12 ద‌ర‌ఖాస్తులే అందాయ‌ని, దీన్ని బ‌ట్టి మీరే అర్థం చేసుకోవాల‌ని సీఎం (Himanta Biswa Sarma)అన్నారు. కొత్త సీఏఏ చ‌ట్టం కింద పౌర‌స‌త్వం పొందిన తొలి వ్య‌క్తిని డుల‌న్ దాస్‌గా గుర్తించారు. అత‌ని వ‌య‌సు 50 ఏళ్లు. ఆగ‌స్టు 2024లో ఆయ‌న‌కు భార‌తీయ పౌర‌స‌త్వం వ‌చ్చింది.

CM Himanta Biswa Sarma-  ముగ్గురు విదేశీయుల‌కే పౌర‌స‌త్వం క‌ల్పించాం: అస్సాం సీఎం
CM Himanta Biswa Sarma- ముగ్గురు విదేశీయుల‌కే పౌర‌స‌త్వం క‌ల్పించాం: అస్సాం సీఎం

బంగ్లా, పాక్‌, ఆఫ్ఘ‌న్ దేశాల్లో మ‌త‌ప‌ర‌మైన వేధింపుల‌కు గురై భార‌త్‌లో ఆశ్ర‌యం కోసం వ‌చ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, క్రైస్త‌వులు, బౌద్దుల‌కు పౌర‌స‌త్వం క‌ల్పించేందుకు స‌ర్కారు సీఏఏ చ‌ట్టాన్ని త‌యారు చేసింది. అయితే 2014, డిసెంబ‌ర్ 31వ తేదీ లోపు ఇండియాలోకి ప్ర‌వేశించి, అయిదేళ్లు పూర్తి చేసుకున్న వారికి పౌర‌స‌త్వం ఇవ్వ‌నున్నారు.

హిమంత బిశ్వ శర్మ నేపథ్యం?

ఆయన విశ్వవిద్యాలయం నుండి 1990లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ మరియు 1992లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పొందారు. ఆ తర్వాత, శర్మ గౌహతిలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుండి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు మరియు 1995లో న్యాయవాది అయ్యారు. ఆయన 1996 నుండి 2001 వరకు గౌహతి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.

అస్సాం ఏకైక మహిళా సీఎం ఎవరు?

ఆమె అస్సాం రాష్ట్ర చరిత్రలో ఏకైక మహిళా మరియు ముస్లిం ముఖ్యమంత్రి. ఆమె 1980 డిసెంబర్ 6 నుండి 1981 జూన్ 30 వరకు అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్నారు. భారత చరిత్రలో కూడా, సయ్యదా అన్వారా తైమూర్ ఏ రాష్ట్రానికైనా మొదటి ముస్లిం మహిళా ముఖ్యమంత్రి.

అస్సాంలో ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రి ఎవరు?

తరుణ్ గొగోయ్ (1 ఏప్రిల్ 1936 – 23 నవంబర్ 2020) ఒక భారతీయ రాజకీయ నాయకుడు మరియు న్యాయవాది, అతను 2001 నుండి 2016 వరకు అస్సాం 13వ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆయన అస్సాం ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేశాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/punjab-floods-heavy-rain-school-closure-september-7-breaking-news/national/540726/

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.