ఇటీవల గుజరాత్(Gujarat) రాష్ట్రం భరూచ్ లోని అమోద్ తాలూకా కోబ్లాలో ఓ ప్రత్యేకమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఈ గ్రామంలో నవంబర్ 8న ఓ గేదె పాలు తాగిన తర్వాత, గ్రామస్తులు టీకాలు వేయించుకునేందుకు పరుగులు పెట్టారు. దీనికి కారణం దాదాపు ఏడాదికిందట గ్రామంలో పాలిచ్చే గేదెను కుక్క కరిచిందని, తర్వాత ఆ గేదెకు రేబిస్ లక్షణాలు కనిపించడంతో, ఆ గేదె(buffalo) పాలు తాగిన గ్రామస్తులు రేబిస్ టీకాలు వేయించుకున్నారు. మరోపక్క గేదె యజమాని, ఆయన కుటుంబం కూడా అమోద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో రేబిస్ వ్యాక్సీన్ వేయించారు.
తరువాత, ఆ పాలు వినియోగించినవారికి, గేదె పాలతో తయారు చేసిన జున్ను తిన్న వారికి కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. రేబీస్ సోకిన గేదెపాలు తాగామనే భయంతో గ్రామస్తులలో చాలామంది డాక్టర్ సలహా మేరకు ఆమోద్ సామాజిక ఆరోగ్యకేంద్రం ముందు టీకాలు వేసుకోవడానికి బారులు తీరారు. ఇప్పటివరకు 39 మందికి రేబిస్ టీకాలు వేశారు.
Read Also: TTD: కల్తీనెయ్యి వ్యవహారం – మాజీ చైర్మన్ వైవి నోరువిప్పితే ఏం జరుగుతుందో?

డాక్టర్లు దీనిపై ఏమంటున్నారు?
రేబీస్ ఓ ప్రమాదకరమైన వైరస్. ఇది జంతువులు కరవడం లేదా దాని లాలాజలం మానవ శరీరంలోకి ప్రవేశించడం ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. ఈ వైరస్(Virus) మానవ నాడీ వ్యవస్థకు ప్రభావితం చేస్తుంది. సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాంతకంగా మారుతుంది. దీంతో కోట్లాలోని మిగతా ప్రజలు కూడా వీలైనంత త్వరగా యాంటీ-రేబిస్ వ్యాక్సీన్ తీసుకోవాలని ఆరోగ్యశాఖ విజ్ఞప్తి చేసింది. గ్రామస్తులకు రేబిస్ వ్యాక్సీన్(Rabies vaccine) బూస్టర్ డోస్ ఇచ్చినట్లు సామాజికఆరోగ్య కేంద్రం వైద్యులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: