हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Special Trains : మధురై, కన్యాకుమారి వెళ్లే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌

Sudheer
Special Trains : మధురై, కన్యాకుమారి వెళ్లే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌

ప్రస్తుతం రైళ్ల(Trains)లో ఉన్న అధిక రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం కాచిగూడ-మధురై, హైదరాబాద్‌-కొల్లం, హైదరాబాద్‌-కన్యాకుమారి మార్గాల్లో నడుస్తున్న ప్రత్యేక రైళ్లను మరిన్ని తేదీల వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ రైళ్లు తాత్కాలికంగా మాత్రమే కాకుండా, ఒక నిర్దిష్ట కాలానికి ప్రతివారం రాకపోకలు సాగిస్తాయని రైల్వే శాఖ వెల్లడించింది.

కాచిగూడ – మధురై స్పెషల్ ట్రైన్ వివరాలు

కాచిగూడ నుంచి మధురైకి వెళ్లే (07191) ప్రత్యేక రైలు ఆగస్టు 18 నుండి అక్టోబర్‌ 13 వరకు ప్రతి సోమవారం నడవనుంది. మధురై నుండి కాచిగూడకు తిరిగివచ్చే (07192) రైలు ఆగస్టు 20 నుండి అక్టోబర్‌ 15 వరకు ప్రతి బుధవారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. వీటితో పాటు రద్దీతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు ఇది ఉపశమనాన్ని కలిగించే అవకాశం ఉంది.

హైదరాబాద్ – కొల్లం, కన్యాకుమారి రైళ్లకు కొనసాగింపు

హైదరాబాద్‌ నుంచి కొల్లం వెళ్లే (07193) రైలు ఆగస్టు 16 నుండి అక్టోబర్‌ 10 వరకు ప్రతి శనివారం నడవనుండగా, కొల్లం నుండి హైదరాబాద్‌కు వచ్చే (07194) రైలు ఆగస్టు 18 నుండి అక్టోబర్‌ 13 వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. అలాగే, హైదరాబాద్‌ – కన్యాకుమారి (07230) ప్రత్యేక రైలు ఆగస్టు 13 నుండి అక్టోబర్‌ 8 వరకు ప్రతి బుధవారం, కన్యాకుమారి – హైదరాబాద్‌ (07229) రైలు ఆగస్టు 18 నుండి అక్టోబర్‌ 10 వరకు ప్రతి శుక్రవారం నడవనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ స్పెషల్‌ రైళ్లతో దక్షిణ భారత ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుంది.

Read Also : Nara Lokesh : 18 రోజుల్లో 50 లక్షల ఇళ్ల సందర్శనతో టీడీపీ రికార్డ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870