Gas booking scam : పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితిని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఆన్లైన్లో గ్యాస్ బుకింగ్ కోసం వెతికే వినియోగదారులను టార్గెట్ చేస్తూ ఫేక్ ప్రకటనలతో మోసం చేస్తున్నట్లు వెల్లడించారు.
ఫేక్ లింకులతో మోసాలు
సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా, వాట్సాప్, SMSల ద్వారా ఫేక్ వెబ్సైట్ లింకులను పంపిస్తున్నారు. వెంటనే గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తామని లేదా అదనపు సిలిండర్లు అందిస్తామని చెప్పి ముందుగానే డబ్బులు చెల్లించమని కోరుతున్నారు.
ఇలాంటి లింకులపై క్లిక్ చేస్తే వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు నేరగాళ్లకు వెళ్లే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ప్రజలకు పోలీసుల సూచనలు
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలకు పలు సూచనలు చేశారు.
- తెలియని లింకులపై క్లిక్ చేయకండి
- ముందుగా డబ్బులు చెల్లించమనే మెసేజ్లను నమ్మకండి
- గ్యాస్ బుకింగ్ కోసం అధికారిక వెబ్సైట్ మాత్రమే వినియోగించండి
- OTP, UPI PIN, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోకండి
Read Also: Warangal crime: విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

మోసాలకు గురైతే ఏమి చేయాలి?
ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930కు కాల్ చేయాలని పోలీసులు సూచించారు. అలాగే అధికారిక వెబ్సైట్ cybercrime.gov.inలో కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
Hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: