हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్..

Tejaswini Y
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్..

ప్రావిడెంట్ ఫండ్ (Provident Fund) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం మరో సౌకర్యాన్ని అందిస్తోంది. ఇప్పటికే డిజిటలైజేషన్ ద్వారా పీఎఫ్ సేవలు సులభతరం చేయబడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు EPFO కార్యాలయాల పనితీరులో పెద్ద మార్పులు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై EPFO కార్యాలయాలు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల (Passport Seva Kendra) తరహాలో పనిచేయనున్నాయి., ఖాతాదారులు కార్యాలయ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.

Read Also: Health News: ఆత్మహత్య ఆలోచనలు డిసెంబర్ లోనే ఎక్కువ

ఈ విషయాన్ని EPFO కొత్త భవన ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. దేశవ్యాప్తంగా EPFO కార్యాలయాలను సింగిల్ విండో సర్వీస్ సెంటర్లుగా మార్చే ప్రణాళికపై ప్రభుత్వం ఆల్రెడీ అడుగులు వేస్తోందని ఆయన తెలిపారు. కొత్త విధానం ట్రయల్ ఫేజ్‌లో ఇప్పటికే ఢిల్లీలో ప్రారంభమైంది.

EPFO KYC Verification
EPFO: Great news for PF subscribers..

ఇప్పటివరకు, ఉద్యోగులు తమ పీఎఫ్ సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ యజమాని అనుబంధిత EPFO కార్యాలయాన్ని మాత్రమే సంప్రదించాల్సి ఉండేది. ఉద్యోగం మారినపుడు లేదా వేరే రాష్ట్రానికి మారినపుడు సమస్యలు పెరుగేవి. కొత్త విధానం అమలులోకి వచ్చిన తర్వాత, ఖాతాదారులు దేశంలోని ఏ EPFO కార్యాలయాన్ని సంప్రదించినా సమస్యలు పరిష్కరించుకోగలరు. అన్ని సేవలు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో అనుసంధానమవుతాయి, తద్వారా క్లెయిమ్‌లు, KYC ధృవీకరణ, ఖాతా బదిలీ వంటి ప్రక్రియలు వేగంగా పూర్తవుతాయి.

డిజిటల్ సేవల్లో ఇబ్బంది

డిజిటల్ సేవల్లో ఇబ్బంది పడే ఖాతాదారులకు ప్రత్యేక EPF సర్వీస్ ప్రొవైడర్లు నియమించబడ్డారు. వారు పీఎఫ్ ఖాతాదారులకు మార్గదర్శకత్వం అందిస్తూ, క్లెయిమ్ దాఖలు, KYC పూర్తి చేయడంలో సహాయం చేస్తారు. కొత్త విధానంతో, విదేశాల్లో పనిచేసిన భారతీయ ఉద్యోగులు కూడా తమ పీఎఫ్ మొత్తాన్ని సులభంగా ఉపసంహరించుకోవచ్చు, విదేశాల్లో కట్ అయిన పీఎఫ్ డబ్బు కోల్పోవాల్సిన అవసరం ఉండదు.

పీఎఫ్ ఖాతాదారులకు సేవలు

ఇలాంటి మార్పులతో పీఎఫ్ ఖాతాదారులకు సేవలు వేగంగా, పారదర్శకంగా, సులభంగా అందుతాయి. ప్రత్యేకంగా KYC సమస్యల కారణంగా నిలిచిపోయిన పీఎఫ్ డబ్బులను ప్రభుత్వ యంత్రాంగం గుర్తించి, ఖాతాదారులకు లేదా వారి కుటుంబ సభ్యులకు అందజేయడానికి మిషన్ మోడ్‌లో పనిచేస్తుంది. ఈ మార్పులు ఉద్యోగుల సామాజిక భద్రతను బలోపేతం చేసే ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870