Earthquake: రాజస్థాన్ రాష్ట్రంలో శనివారం ఉదయం స్వల్ప భూకంపం నమోదైంది. రాష్ట్రంలోని సికార్ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు అనుభవించినట్లు సమాచారం. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 3.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.
Read Also:India Oil Reserves: భారత్ వద్ద 4వేల కోట్ల లీటర్ల ముడి చమురు!

సికార్ సమీపంలో ఉదయం ప్రకంపనలు
ఉదయం సుమారు 6.30 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. భూమి ఉపరితలం నుంచి దాదాపు 5 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నాయని నిపుణులు పేర్కొన్నారు.
ఈ ప్రకంపనలు ఖాటుశ్యామ్జీ, పల్సానా, ధింగ్పూర్ ప్రాంతాల్లో స్వల్పంగా అనిపించాయని స్థానికులు చెబుతున్నారు. దాదాపు 1–2 సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించినట్లు వారు వివరించారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. పరిస్థితి పూర్తిగా కంట్రోల్లో ఉందని కూడా వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: