మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) ఇండోర్ నగరంలోని భగీరత్పుర ప్రాంతంలో కలుషిత నీటి కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఎన్నోసార్లు అవార్డులు గెలుచుకున్న ఇండోర్ ఇప్పుడు తాగునీటి కాలుష్యంతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
(Drinking Water) తాగునీటి పైపులైన్లలోకి డ్రైనేజీ నీరు చేరడంతోనే ప్రజలు అనారోగ్యానికి గురైనట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ముఖ్యంగా పాత పైపులైన్లు, లీకేజీలు ఉన్న ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. కొన్ని రోజులుగా స్థానికులు నీటిలో దుర్వాసన వస్తోందని ఫిర్యాదులు చేసినా, సమయానికి చర్యలు తీసుకోకపోవడమే ఈ దుర్ఘటనకు కారణమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భగీరత్పురతో పాటు ఇండోర్ నగరంలోని మొత్తం 59 ప్రాంతాల్లో తాగునీరు పూర్తిగా కాలుష్యమైందని కాలుష్య నియంత్రణ బోర్డు నివేదిక వెల్లడించింది. ఈ నీరు తాగడానికి అనర్హమని, ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదకరమని బోర్డు స్పష్టం చేసింది. కలుషిత నీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కార్పొరేషన్కు బోర్డు మూడు సార్లు లేఖలు రాసి హెచ్చరించినట్లు నివేదికలో పేర్కొంది.
Nara Lokesh: దేశంలో పెట్టుబడుల ఆకర్షణలో నంబర్ వన్గా ఏపీ

అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల్లో ఆగ్రహం
భగీరత్పుర ప్రాంతంలో కలుషిత నీటిని తాగడం వల్ల ఇప్పటివరకు 15 మంది మరణించగా, 2,800 మంది అనారోగ్యానికి గురయ్యారు. (Drinking Water) ఈ మరణాలన్నీ కలుషిత నీటి వల్లే జరిగాయని ఎంజీఎం మెడికల్ కాలేజీ ల్యాబ్ నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఇండోర్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ యాదవ్ను తొలగించింది. అదనపు కమిషనర్ రోహిత్ సిసోడియాను సస్పెండ్ చేసింది. అలాగే నీటి పంపిణీ విభాగం ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ప్రదీప్ నిగమ్ను పదవి నుంచి తొలగించింది. ఒకప్పుడు పరిశుభ్రతకు మారుపేరుగా నిలిచిన ఇండోర్లో తాగునీరు ఇప్పుడు ప్రాణాంతకంగా మారింది. ఇది ఇండోర్కే పరిమితం కాకుండా, దేశంలోని అనేక రాష్ట్రాల్లో నీటి సమస్య భయానక రూపం దాలుస్తోందన్న ఆందోళనను ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: