భారతీయ ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ కార్డులకు మరింత బలమైన భద్రతా ఫీచర్లను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం, త్వరలో విడుదలయ్యే కొత్త ఆధార్ కార్డుల్లో పేరు, చిరునామా, ఆధార్ నంబర్ వంటి వ్యక్తిగత(Digital India) వివరాలు నేరుగా కార్డ్పై ముద్రించబడవు.
Read Also: BSNL: మరో కొత్త రీచార్జ్ ప్లాన్

ఈ కొత్త కార్డుల్లో వినియోగదారుడి ఫోటోతో పాటు ప్రత్యేక క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటుందని అధికారులు తెలిపారు. వెరిఫైడ్ స్కానర్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు మాత్రమే సంబంధిత వ్యక్తి వివరాలు కనిపించేలా వ్యవస్థను రూపొందిస్తున్నారు.
ఈ మార్పుతో ఆధార్ కార్డ్ దుర్వినియోగం, డేటా లీకేజీ వంటి ప్రమాదాలను తగ్గించవచ్చని UIDAI భావిస్తోంది. ముఖ్యంగా ఫోటోకాపీలు లేదా నకిలీ కార్డుల(Digital India) ద్వారా సమాచారం దుర్వినియోగం జరిగే అవకాశాలను పూర్తిగా అడ్డుకునే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. గోప్యతను కాపాడటం, డిజిటల్ ఐడెంటిటీని మరింత సురక్షితంగా మార్చడం ఈ కొత్త ఆధార్ కార్డ్ రూపకల్పన యొక్క ప్రధాన ఉద్దేశమని నిపుణులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: