हिन्दी | Epaper

Republic Day 2026 : రిపబ్లిక్ డే వేళ 10వేల కిలోల పేలుడు పదార్థాలు లభ్యం..ఎవరి పని ఇది ?

Sudheer
Republic Day 2026 : రిపబ్లిక్ డే వేళ 10వేల కిలోల పేలుడు పదార్థాలు లభ్యం..ఎవరి పని ఇది ?

రిపబ్లిక్ డే వేడుకలకు ముందు రాజస్థాన్‌లో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. నాగౌర్ జిల్లాలోని హార్సౌర్ ప్రాంతంలో ఉన్న ఒక ఫామ్‌హౌస్‌పై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించగా, అక్కడ నిల్వ ఉంచిన 10,000 కిలోల అమ్మోనియం నైట్రేట్ బ్యాగులను, పెద్ద సంఖ్యలో డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. గణతంత్ర దినోత్సవానికి కొద్ది గంటల ముందే ఇంత భారీ స్థాయిలో పేలుడు సామాగ్రి దొరకడంతో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. భద్రతా పరంగా అత్యంత కీలకమైన ఈ సమయంలో ఈ ఘటన బయటపడటం పలు అనుమానాలకు తావిస్తోంది.

Padma Sri Awards 2026: తెలుగు రాష్ట్రాల్లో పద్మశ్రీలు అందుకున్న వారు వీరే

ఈ కేసులో పోలీసులు సులేమాన్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో అతనికి గతంలోనే క్రిమినల్ రికార్డు ఉన్నట్లు తేలింది. ఇంత భారీ పరిమాణంలో అమ్మోనియం నైట్రేట్‌ను ఒక ఫామ్‌హౌస్‌లో ఎందుకు నిల్వ చేశారనే దానిపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. సాధారణంగా మైనింగ్ పనులకు అమ్మోనియం నైట్రేట్ వాడుతుంటారు, కానీ దానికి తగిన అనుమతులు ఉన్నాయా లేదా? లేక ఏదైనా విద్రోహ చర్యలకు ప్లాన్ చేస్తున్నారా? అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు.

ముఖ్యంగా సులేమాన్ ఖాన్‌కు ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాలతో లేదా నిషేధిత సంస్థలతో ఏవైనా సంబంధాలు ఉన్నాయా అనే అంశంపై పోలీసులు దృష్టి సారించారు. నిందితుడి కాల్ డేటా మరియు బ్యాంక్ లావాదేవీలను పరిశీలిస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా రాజస్థాన్‌తో పాటు ఢిల్లీ వంటి పొరుగు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో, ఈ పేలుడు పదార్థాల వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ ఘటనతో సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను మరింత కఠినతరం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ ఎంపీల ధర్నా!

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ ఎంపీల ధర్నా!

గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందా? ఈ వార్తలపై ఆయిల్ కంపెనీల క్లారిటీ

గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందా? ఈ వార్తలపై ఆయిల్ కంపెనీల క్లారిటీ

LPG సిలిండర్ ఏడాదికి 15 సిలిండర్లు మాత్రమే

LPG సిలిండర్ ఏడాదికి 15 సిలిండర్లు మాత్రమే

పార్లమెంట్‌లో రాజకీయ రచ్చ, స్పీకర్‌పై అవిశ్వాసం

పార్లమెంట్‌లో రాజకీయ రచ్చ, స్పీకర్‌పై అవిశ్వాసం

ప్రోటోకాల్ రచ్చ, మోదీని టార్గెట్ చేసిన మమత బెనర్జీ

ప్రోటోకాల్ రచ్చ, మోదీని టార్గెట్ చేసిన మమత బెనర్జీ

నేటి నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు..

నేటి నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు..

బంగారం ధరలు స్థిరం, హైదరాబాద్‌లో ఈరోజు రేట్లు ఇవే

బంగారం ధరలు స్థిరం, హైదరాబాద్‌లో ఈరోజు రేట్లు ఇవే

టీమ్ ఇండియాకు అభినందనలు:పవన్ కళ్యాణ్

టీమ్ ఇండియాకు అభినందనలు:పవన్ కళ్యాణ్

పృథ్వీ షా ఎంగేజ్‌మెంట్, ఎవరీ ఆకృతి అగర్వాల్?

పృథ్వీ షా ఎంగేజ్‌మెంట్, ఎవరీ ఆకృతి అగర్వాల్?

టీ20 వరల్డ్ కప్ విజేతకు కాసుల వర్షం, ఎంతంటే?

టీ20 వరల్డ్ కప్ విజేతకు కాసుల వర్షం, ఎంతంటే?

90 ఏళ్ల వృద్ధురాలిపై గ్యాంగ్ రేప్, మధ్యప్రదేశ్‌లో షాక్

90 ఏళ్ల వృద్ధురాలిపై గ్యాంగ్ రేప్, మధ్యప్రదేశ్‌లో షాక్

భారత్‌తో స్నేహం కోరుతున్న చైనా: విదేశాంగ మంత్రి కీలక ప్రకటన!

భారత్‌తో స్నేహం కోరుతున్న చైనా: విదేశాంగ మంత్రి కీలక ప్రకటన!

📢 For Advertisement Booking: 98481 12870