हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Delhi red alert : దట్టమైన పొగమంచుతో ఢిల్లీకి రెడ్ అలర్ట్ | 128 విమానాలు రద్దు

Sai Kiran
Delhi red alert : దట్టమైన పొగమంచుతో ఢిల్లీకి రెడ్ అలర్ట్ | 128 విమానాలు రద్దు

Delhi red alert : దట్టమైన పొగమంచు కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి తీవ్రంగా మారింది. వాతావరణ శాఖ (IMD) ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్‌ను రెడ్ అలర్ట్‌గా అప్గ్రేడ్ చేస్తూ మంగళవారం వరకూ హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రభావంతో ఇప్పటివరకు 128 విమానాలు రద్దయ్యాయి.

ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్‌తో పాటు ఉత్తర, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు కూడా అలర్ట్ జారీ చేసినట్లు ఐఎండీ తెలిపింది.
“డిసెంబర్ 30 ఉదయం వరకూ దట్టమైన నుంచి అత్యంత దట్టమైన పొగమంచు కమ్ముకునే అవకాశం ఉంది. విజిబిలిటీ బాగా తగ్గుతుంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దు” అని ఐఎండీ హెచ్చరించింది.

Read also: EC: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు ఈసీ కసరత్తు

ఇండిగో ట్రావెల్ అడ్వైజరీ

పొగమంచు ప్రభావంతో ఉత్తర భారతదేశంలోని పలు (Delhi red alert) విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని ఇండిగో ఎయిర్‌లైన్స్ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది.
రాత్రి, ఉదయం వేళల్లో పొగమంచు ఎక్కువగా ఉండటంతో ఫ్లైట్లు ఆలస్యం కావడం లేదా రద్దు అయ్యే అవకాశం ఉందని తెలిపింది.

ప్రయాణికులు తమ ఫ్లైట్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని, విమానాశ్రయానికి ముందుగానే చేరుకోవాలని ఇండిగో సూచించింది. రోడ్డు రవాణాపై కూడా పొగమంచు ప్రభావం ఉండవచ్చని హెచ్చరించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870