దేశ రాజధాని ఢిల్లీ (Delhi Crime) లో, ప్రముఖ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఒక 16 ఏళ్ల విద్యార్థి, ఉపాధ్యాయుల నిరంతర వేధింపులను తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నాడు. రాజేంద్ర ప్లేస్ మెట్రో స్టేషన్ నుండి దూకి ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది..
Read Also: Gaza: మరోసారి గాజాపై ఇజ్రాయెల్ దాడి
ప్రతిరోజూ.. మంగళవారం ఉదయం 7.15 గంటలకు తండ్రి ఆ విద్యార్థిని పాఠశాల వద్ద వదిలివెళ్లారు. అయితే అదే రోజు మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో.. సెంట్రల్ ఢిల్లీలోని రాజేంద్ర ప్లేస్ మెట్రో స్టేషన్ సమీపంలో సదరు బాలుడు గాయాలతో పడి ఉన్నట్లు తండ్రికి ఫోన్ వచ్చింది.
వారు ఆసుపత్రికి చేరుకునేలోపే బీఎల్ కపూర్ ఆసుపత్రిలోని వైద్యులు ఆ బాలుడు మరణించినట్లు ధృవీకరించారు. కుమారుడి మరణంతో కుమిలిపోయిన తండ్రి.. వెంటనే పాఠశాల ప్రిన్సిపాల్తో పాటు ముగ్గురు ఉపాధ్యాయులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వెలుగులోకి సూసైడ్ లెటర్
గత కొద్ది రోజులుగా తన కొడుకును పాఠశాలలోని ఈ ఉపాధ్యాయులు మానసికంగా హింసించడం వల్లే ప్రాణాలను తీసుకున్నాడని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తండ్రి ఆరోపణల ప్రకారం.. మంగళవారం ఒక డ్రామా క్లాస్లో ఆ బాలుడు అనుకోకుండా కిందపడిపోయాడు. దీనికి ఒక టీచర్ స్పందిస్తూ.. ఆ బాలుడిని అవమానించి, అతిగా నటిస్తున్నావని ఎగతాళి చేశారు.
బాలుడు ఏడవడం మొదలు పెట్టినప్పటికీ.. ఆ టీచర్ “నువ్వు ఎంత ఏడ్చినా పట్టించుకోను” అని మరింత కోపంగా మాట్లాడారు. ఇదంతా తట్టుకోలేకపోయిన విద్యార్థి బయటకు వచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంత జరుగుతున్నా అక్కడే ఉన్న ప్రిన్సిపాల్ కూడా వేధింపులను ఆపేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని తండ్రి ఆరోపించారు. మరోవైపు పోలీసులు బాలుడి బ్యాగులో స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్లో ప్రిన్సిపాల్, ఇద్దరు ఉపాధ్యాయుల పేర్లను స్పష్టంగా తెలియజేశాడు.

వారి వేధింపులు తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు చెబుతూ.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నాడు. తద్వారా మరే విద్యార్థి కూడా తనలాంటి దుస్థితిని ఎదుర్కోకుండా చూడాలని కోరాడు. అలాగే తన అవయవాలు పని చేసే స్థితిలో ఉంటే వాటిని అవసరమైన వారికి దానం చేయండని విజ్ఞప్తి చేశాడు.
పలు సెక్షన్ల కింద కేసులు నమోదు
తన సోదరుడికి, తండ్రికి క్షమాపణలు చెప్పాడు. ఎల్లప్పుడూ తనకు మద్దతుగా నిలిచిన తల్లికి కృతజ్ఞతలు తెలుపుతూ.. తండ్రిని, సోదరుడిని చక్కగా చూసుకోవాలని కోరాడు. ఈ సూసైడ్ లెటర్ ఆధారంగా.. పోలీసులు సదరు ఉపాధ్యాయులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఉపాధ్యాయుల వేధింపుల ఆరోపణలపై పాఠశాల సిబ్బందిని విచారించేందుకు సిద్ధమవుతున్నారు. చూడాలి మరి ఈకేసులో మున్ముందు ఏం జరగనుంది అనేది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: