हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Delhi CM: రేఖ గుప్త దాడిలో కీలక ఆధారం లభ్యం!

Pooja
Delhi CM: రేఖ గుప్త దాడిలో కీలక ఆధారం లభ్యం!

ఢిల్లీ ముఖ్యమంత్రి(Delhi CM) రేఖా గుప్తాపై జరిగిన దాడికి సంబంధించిన వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీలో జరిగిన “జన సున్వాయి”(Public opinion) కార్యక్రమ సమయంలో, గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజేష్ భాయ్ ఖిమ్జీ భాయ్ సకారియా అనే వ్యక్తి ముఖ్యమంత్రి దగ్గరకు ఫిర్యాదుదారుగా వచ్చి ఆమెపై అకస్మాత్తుగా దాడి చేశాడు. అయితే ఇది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు, ముందే పక్కా ప్రణాళికతో జరిగిన దాడిగా అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రాజేష్ ఒకరోజు ముందే ముఖ్యమంత్రి నివాసం చుట్టూ రెక్కీ చేసినట్టు గుర్తించారు. అతను తన ఫోన్‌లో వీడియోలు కూడా తీసినట్టు సమాచారం.

Delhi CM
Delhi CM

నిందితుడికి నేరచరిత్ర

దాడికి పాల్పడిన రాజేష్‌పై గుజరాత్‌లో ఇప్పటికే ఐదు కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. వాటిలో నాలుగు కేసుల నుంచి అతను తప్పించుకున్నా, ఒక కేసు ఇంకా కోర్టులో విచారణలో ఉంది. దాడికి ముందు అతను ముఖ్యమంత్రిని(The Chief Minister) కలుసుకోవాలన్న ఉద్దేశంతో ఆమె నివాసానికి వచ్చాడని, కానీ దాడి వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఇంకా తెలియరాలేదని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఈ దాడికి గల కారణాలపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి.

కొంతమంది వాదనల ప్రకారం, నిందితుడి బంధువు జైలులో ఉండగా, అతడిని విడుదల చేయాలనే కోరికతో ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చాడట. ఇంకొంతమంది అభిప్రాయం ప్రకారం, అతను జంతు ప్రేమికుడు, వీధి శునకాలపై(street dogs) జరిగిన తీర్పుతో అసంతృప్తిగా ఉండి, ఆ కోపంతో దాడికి పాల్పడినట్టు చెబుతున్నారు. అతని మానసిక స్థితి సరిగాలేదన్న కోణాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. నిందితుడి తల్లిని ప్రశ్నించగా, ఆమెకు తన కుమారుడు ముఖ్యమంత్రిని కలవబోతున్న విషయం తెలియదని వెల్లడించింది.

దాడిపై భిన్న కధనాలు

ఈ దాడి వల్ల భద్రతాపరంగా పెద్ద విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి జుట్టు పట్టుకుని కిందపడేయబడిన తరువాత, భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి ఆమెను రక్షించారు. దాడికి గల అసలు ఉద్దేశం ఏమిటన్న దానిపై అధికారులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని విషయాలను రాబట్టేందుకు గుజరాత్ పోలీసులు, స్థానిక సైబర్ బృందాలు కలిసి పని చేస్తున్నారు.

రేఖా గుప్తాకు గాయాలయ్యాయా?
ఆమెకు తేలికపాటి గాయాలయ్యాయి. వైద్యులు తనిఖీ చేసిన తరువాత ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని తెలిపారు.

నిందితుడికి మానసిక సమస్య ఉందా?
అతను జంతు ప్రేమికుడిగా ఉన్నాడని, వీధి కుక్కలపై తీసిన తీర్పుతో అసంతృప్తిగా ఉన్నాడని సమాచారం. అతని మానసిక స్థితి సరిగాలేదన్న కోణాన్ని పోలీసులు దర్యాప్తులో పరిశీలిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/crime-newsthe-mystery-of-the-murder-of-a-sahasra-that-will-not-go-away-for-two-days/hyderabad/533185/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870