Telugu News: Delhi Blast: ఢిల్లీ పేలుడు లో 12కు చేరిన మృతుల సంఖ్య

Read Time:  1 min
Delhi Blast
Delhi Blast
FONT SIZE
GET APP

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన కారు పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 12కు చేరిందని ఢిల్లీ పోలీసులు తాజాగా వెల్లడించారు. ఈ శక్తివంతమైన పేలుడు ఎర్రకోట(Red Fort) మెట్రో స్టేషన్ వద్ద ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నెమ్మదిగా వెళుతున్న కారులో సంభవించింది.

Read Also: AP: మంగళగిరిలో మంత్రి లోకేశ్ చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమం

Delhi Blast
Delhi Blast

ఎఫ్ఐఆర్ నమోదు, హైఅలర్ట్

ఈ దారుణ ఘటనపై ఢిల్లీ పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) మరియు పేలుడు పదార్థాల చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పేలుడు నేపథ్యంలో దేశ రాజధానిలో హైఅలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్ వంటి కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి, కఠిన నిఘా ఏర్పాటు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Sushmitha

రచయిత గురించి

Sushmitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.