Telugu News: Dulquer:పన్ను ఎగవేత ఆరోపణలపై అధికారుల కస్టమ్స్ రెయిడ్

Read Time:  1 min
Telugu News: Dulquer-పన్ను ఎగవేత ఆరోపణలపై అధికారుల కస్టమ్స్ రెయిడ్
Telugu News: Dulquer-పన్ను ఎగవేత ఆరోపణలపై అధికారుల కస్టమ్స్ రెయిడ్
FONT SIZE
GET APP

మలయాళ నటులు దుల్కర్ సల్మాన్,(Dulquer Salmaan) పృథ్విరాజ్ సుకుమారన్ నివాసాలపై కస్టమ్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ రోజు ఉదయం కొచ్చిలోని వారి ఇళ్లలో సోదాలు చేపట్టారు. లగ్జరీ కార్ల అక్రమ రవాణా ఆరోపణలకు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు ‘ఆపరేషన్ నమకూర్’ను ప్రారంభించారు. ఇందులో భాగంగానే దుల్కర్, పృథ్విరాజ్ నివాసాలతో పాటు కేరళలోని 5 జిల్లాల్లో 30 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి.

Dulquer

భూటాన్ నుంచి అక్రమ రవాణా ఆరోపణలు

ఒక ఆన్‌లైన్ మ్యాగజైన్(Online magazine) కథనం ప్రకారం, దుల్కర్, పృథ్విరాజ్‌లు భూటాన్ నుంచి అక్రమంగా లగ్జరీ కార్లను తెప్పించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. సోదాల్లో అధికారులు ఈ లగ్జరీ వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా, భూటాన్(Bhutan) ఆర్మీకి చెందిన హై-ఎండ్ వాహనాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి, వాటిని అక్రమంగా భారత్‌లోకి రవాణా చేసే ముఠా నుంచి ఈ నటులు వాహనాలను కొనుగోలు చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే, పృథ్విరాజ్ సుకుమారన్ నివాసంలో జరిపిన సోదాల్లో ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిసింది.

లగ్జరీ కార్ల స్మగ్లింగ్ ముఠా

భూటాన్‌లో నిర్వహించే వేలంలో ఖరీదైన వాహనాలను తక్కువ ధరకు కొని, వాటిని హిమాచల్ ప్రదేశ్ మీదుగా భారత్‌లోకి అక్రమంగా తీసుకువచ్చి సెలబ్రిటీలకు అమ్ముతుండటమే ఈ ముఠా పని అని తెలుస్తోంది. కస్టమ్స్ అధికారులు ఈ ముఠాపై నిఘా ఉంచి, ఇప్పుడు ‘ఆపరేషన్ నమకూర్’తో అక్రమ రవాణా కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

కస్టమ్స్ అధికారులు ఏ ఆరోపణలపై దాడులు నిర్వహించారు?

లగ్జరీ కార్లను భూటాన్ నుంచి అక్రమంగా రవాణా చేసుకున్నారనే ఆరోపణలపై అధికారులు దాడులు చేశారు.

ఏ నటుల నివాసాలపై సోదాలు జరిగాయి?

మలయాళ నటులు దుల్కర్ సల్మాన్, పృథ్విరాజ్ సుకుమారన్ నివాసాలపై సోదాలు జరిగాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Sushmitha

రచయిత గురించి

Sushmitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.