ఉత్తరాఖండ్ దెహ్రాదూన్ లో మేఘ విస్ఫోటనం సంభవించింది. సహస్రధారలో పోటెత్తిన మెరుపువరదల్లో పలువురు గల్లంతు అయ్యారు. అకస్మాత్తుగా వచ్చిన వరద, ఇతర శిథిలాల తాకిడికి పలు ఇళ్లు, హోటళ్లు దెబ్బతినగా, అనేక వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. ఇటీవల ఇలాంటి ఘటనలు దేశంలో పలుచోట్ల జరిగాయి. జమ్మూకాశ్మీర్ లో ఆగస్టు నెలలో క్లౌడ్ బరస్ట్ తో గ్రామం మొత్తం తుడిచిపెట్టుకుని పోయింది. ఈ సంఘటనతో అనేకులు మరణించగా పలువురు గల్లంతు అయ్యారు. ఇదేమాసంలో ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్ అయి, పలువురు మరణించారు.(Died) ఇలాంటి సంఘటన జరగడం ఇది రెండోసారి.
విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
డెహ్రాడూన్ లో భారీ వరదలతో విద్యాసంస్థలకు(educational institutions) ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తపోవన్ ప్రాంతంలో నివాసాలు జలమయమయ్యాయి. వరదనీరు భారీగా చేయడంతో జిల్లాలోని తమ్సా, టన్స, సాంగ్ నదులు ఉదతంగా ప్రవహిస్తున్నాయి. మాల్ దేవతా ప్రాంతంలో ఓ వంతెన కొట్టుకుపోయింది. తపకేశ్వర్ మహాదేవ్ ఆలయం నీటమునిగింది. ముస్సీ రీలోనూ భారీగా నష్టం వాటిల్లినట్లు తెలిసింది. ప్రభుత్వం ఎప్పటటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ, ప్రజలకు సాయం చేస్తున్నది. సైన్యం కూడా సహాయక చర్యలు చేపట్టింది.
క్లౌడ్ బరస్ట్ ఎక్కడ జరిగింది?
ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
క్లౌడ్ బరస్ట్ వల్ల ఏమి జరిగింది?
భారీ వరదలు వచ్చి ఇళ్లు, రహదారులు దెబ్బతిన్నాయి. పలువురు గల్లంతయ్యారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: