CISF Cyclathon 2026: భారతదేశ సముద్ర తీర భద్రత కేవలం రక్షణ దళాలతోనే సాధ్యం కాదని, తీర ప్రాంత ప్రజల, ముఖ్యంగా మత్స్యకారుల క్రియాశీల భాగస్వామ్యంతోనే ఇది మరింత పటిష్టం అవుతుందని సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ప్రవీర్ రంజన్ పేర్కొన్నారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిష్టాష్టాత్మక ‘వందే మాతరం కోస్టల్ సైక్లథాన్-2026’ సందర్భంగా కళింగపట్నంలో నిర్వహించిన కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు.
Read Also:Himanshu Shukla: GST వసూళ్లపై కలెక్టర్ సమీక్ష
గ్రామాల దత్తత మరియు సామాజిక బాధ్యత(CISF Cyclathon 2026)
ఈ యాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా 52 తీర ప్రాంత గ్రామాలను సీఐఎస్ఎఫ్ దత్తత తీసుకుంటోందని ప్రవీర్ రంజన్ వెల్లడించారు. ఈ గ్రామాల్లో ఏడాది పొడవునా విద్య, క్రీడలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి సామాజిక బాధ్యత కార్యక్రమాలను ఓఎన్జీసీ, పోర్ట్ అథారిటీల సహకారంతో నిర్వహించనున్నట్లు తెలిపారు.

6,600 కిలోమీటర్ల సైక్లథాన్ యాత్ర
పశ్చిమ బెంగాల్లోని బఖాలీ నుండి ఒక బృందం, గుజరాత్లోని లఖ్పత్ నుండి మరో బృందం తన ప్రయాణాన్ని మొదలుపెట్టిందని ఆయన వివరించారు. ఈ రెండు బృందాలు 9 తీరప్రాంత రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా సుమారు 6,600 కిలోమీటర్లు ప్రయాణించి, ఫిబ్రవరి 22న కేరళలోని కొచ్చి వద్ద తమ యాత్రను ముగిస్తాయన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: