Latest News: Car prices: వచ్చే ఏడాది నుంచి పెరగనున్న కార్ల ధరలు

Read Time:  1 min
Latest News: Car prices: వచ్చే ఏడాది నుంచి పెరగనున్న కార్ల ధరలు
FONT SIZE
GET APP

జర్మనీకి చెందిన ప్రఖ్యాత లగ్జరీ కార్ల (Car prices) తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ (Mercedes-Benz) కస్టమర్లకు షాక్ ఇవ్వబోతోంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కార్ల ధరలు (Car prices) పెంచనుంది. 1-2% మేర పెరుగుదల ఉంటుందని తెలిపింది. అయితే ఏ మోడల్ ధర ఎంత పెరుగుతుందనే విషయాన్ని చెప్పలేదు. యూరో స్థిరంగా రూ.100 మార్కుకు పైనే ఉంది. దీనివల్ల స్థానిక ఉత్పత్తి కోసం దిగుమతి చేసుకున్న విడిభాగాలు మొదలుకొని, పూర్తిగా నిర్మించిన యూనిట్ల వరకు అన్ని కార్యకలాపాలపైనా ప్రభావితం కనిపిస్తోందని మెర్సిడెస్- బెంజ్ ఇండియా ఎండీ,సీఈఓ సంతోష్ అయ్యర్ అన్నారు.

Read Also: Egg Prices: కోడి గుడ్ల ధరల కు రెక్కలు

Car prices to increase from next year
Car prices to increase from next year

కార్యకలాపాల నిర్వహణ కోసం కొంత పెంపు

పెరిగిన ఖర్చులను స్థానిక విడిభాగాలను కొనుగోలు చేయడం ద్వారా తగ్గించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, కార్యకలాపాల నిర్వహణ కోసం కొంత పెంపు తప్పనిసరి. అంతేకాకుండా ద్రవ్యోల్బణ ఒత్తిడి, ఇన్పుట్ ఖర్చులు, కమొడిటీ ధరలు, పెరిగిన లాజిస్టిక్ ఖర్చులు కంపెనీ లాభాలపై ఒత్తిడి కలిగిస్తాయని, అందుకే ధరలను సర్దుబాటు చేస్తున్నట్టు కంపెనీ వివరణ ఇచ్చింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.