हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Telugu News: Bihar Results: ఇండియా కూటమి నాయకత్వ మార్పు పై చర్చలు

Tejaswini Y
Telugu News: Bihar Results: ఇండియా కూటమి నాయకత్వ మార్పు పై చర్చలు

బీహార్ అసెంబ్లీ(Bihar Results) ఎన్నికల్లో కాంగ్రెస్ తీవ్రమైన పరాజయం ఎదుర్కొన్న నేపథ్యంలో, విపక్ష ‘ఇండియా’ కూటమిలో నాయకత్వ మార్పుపై మళ్లీ చర్చలు మొదలయ్యాయి. సమాజ్‌వాదీ పార్టీ కి చెందిన ఎమ్మెల్యే రవిదాస్ మెహ్రోత్రా చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత ఊపునిచ్చాయి. ఆయన అభిప్రాయంతో సమాజ్‌వాదీ పార్టీ అధినేత, కనౌజ్ ఎంపీ అఖిలేష్ యాదవ్‌నే ఇండియా కూటమి కొత్త నాయకుడిగా నిలబడాలని సూచించారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీకి స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తి ఉందని చెప్పారు.

Read Also: Delhi Blast: కారు బాంబు పేలుడు కేసు విచారణలో సంచలన విషయాలు

లక్నో సెంట్రల్ ఎమ్మెల్యే మెహ్రోత్రా మాట్లాడుతూ,

“ఇండియా కూటమిని అఖిలేష్ యాదవ్ ముందుకు నడిపాలి. ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సామర్థ్యం పూర్తిగా సమాజ్‌వాదీ పార్టీకే ఉంది” అని పేర్కొన్నారు.
అంతేకాకుండా, బీహార్ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరిగి ఉంటే, ఇండియా కూటమి అధికారంలోకి వచ్చి ఉండేదని కూడా అభిప్రాయపడ్డారు. ఈవీఎంలపై ప్రశ్నలు లేవనెత్తుతూ, బ్యాలెట్ ఓటింగ్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని అఖిలేష్ యాదవ్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు.

India Alliance talks on leadership change

కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ

బీహార్ ఎన్నికల్లో(Bihar Results) కాంగ్రెస్ ప్రదర్శన దారుణంగా పడిపోవడం ఈ వ్యాఖ్యలకు ప్రత్యేక ప్రాధాన్యం తీసుకొచ్చింది. గత ఎన్నికల్లో 19 సీట్లు సాధించిన కాంగ్రెస్, ఈసారి కేవలం 6 సీట్లకు పరిమితమైంది. కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వంటి నేతలు విస్తృత ప్రచారం చేసినా ఫలితం కనిపించలేదు. ఆర్జేడీ కూడా గత సారితో పోలిస్తే భారీగా తగ్గి కేవలం 25 సీట్లు గెలుచుకుంది. మరోవైపు, NDA 243 స్థానాల్లో 202 సీట్లతో భారీ విజయాన్ని అందుకుంది.

కాంగ్రెస్ నేత కళ్యాణ్ బెనర్జీ

ఇటీవలి కాలంలో కాంగ్రెస్ వరుసగా రాష్ట్ర ఎన్నికల్లో బలహీనతను చూపుతుండడంతో, ఇండియా కూటమిలోని ఇతర పార్టీల నుంచి నాయకత్వ మార్పు డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇంతకుముందే తృణమూల్ కాంగ్రెస్ నేత కళ్యాణ్ బెనర్జీ, తమ అధినేత్రి మమతా బెనర్జీనే కూటమికి నాయకురాలిగా చూడాలని అభిప్రాయపడ్డారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ పేరు ఇప్పుడు ప్రతిపక్ష కూటమి నాయకత్వ పోటీలో కొత్త కేంద్రబిందువుగా మారింది. లోక్‌సభలో సమాజ్‌వాదీ పార్టీ 37 సీట్లు గెలుచుకోవడంతో, కాంగ్రెస్ తర్వాత రెండో పెద్ద ప్రతిపక్షంగా ఎదగడం కూడా ఈ చర్చలకు బలం చేకూర్చింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870