Bhogapuram Airport : విజయనగరం జిల్లాలో నిర్మాణంలో ఉన్న Bhogapuram International Airport కల నిజమయ్యే దశకు చేరుకుంది. భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం విజయవంతంగా ల్యాండ్ అవడంతో ఈ ప్రాంత ప్రజల ఎన్నాళ్ల కల సాకారమైంది. గురువారం ఉదయం 10:15 గంటలకు ఢిల్లీ నుంచి వచ్చిన వ్యాలిడేషన్ (టెస్ట్) ఫ్లైట్ రన్వేపై సురక్షితంగా దిగింది.
ఈ టెస్ట్ ఫ్లైట్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి Kinjarapu Ram Mohan Naidu, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏటీసీ ఛైర్మన్తో పాటు ఇతర అధికారులు ప్రయాణించారు. తొలి విమానం సజావుగా ల్యాండ్ కావడంతో విమానాశ్రయ పనుల నాణ్యతపై అధికారుల్లో విశ్వాసం పెరిగింది.
Read also: Social Media: ఫ్రాన్స్ సంచలన నిర్ణయం
అత్యాధునిక సాంకేతికతతో నిర్మిస్తున్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టు పనులు ఇప్పటికే 96 శాతానికి పైగా పూర్తయ్యాయని నిర్మాణ సంస్థ జీఎంఆర్ వెల్లడించింది. టెర్మినల్ భవనం, రన్వే, నావిగేషన్ సిస్టమ్స్ వంటి కీలక మౌలిక సదుపాయాలు తుది దశకు చేరుకున్నట్లు తెలిపింది.
ఈ నేపథ్యంలో జూన్ 26న భోగాపురం అంతర్జాతీయ (Bhogapuram Airport) విమానాశ్రయాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం, ఎయిర్పోర్టు యాజమాన్యం సన్నాహాలు వేగవంతం చేశాయి. ఈ టెస్ట్ ఫ్లైట్ విజయంతో త్వరలోనే విజయనగరం–విశాఖపట్నం పరిసర ప్రాంతాల నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.
భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైతే ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపిరి పోసే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాణిజ్యం, పర్యాటకం, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, ఈ ప్రాంతానికి అంతర్జాతీయ గుర్తింపు లభించనుందని భావిస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: