Bakrid 2025 : దేశవ్యాప్తంగా బక్రీద్ వేడుకలు

Read Time:  1 min
Bakrid 2025 : దేశవ్యాప్తంగా బక్రీద్ వేడుకలు
FONT SIZE
GET APP

దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఈద్ అల్ అజ్హా (Bakrid ) పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. పంజా కట్టుకున్న ముస్లింలు సంప్రదాయ దుస్తుల్లో మసీదులను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉదయం నుంచే మసీదుల్లో నమాజ్ నిర్వహించడంతో పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఢిల్లీ జామా మసీదులో వేలాదిమంది ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రార్థనలు అనంతరం ఒకరికొకరు ఆలింగనంతో శుభాకాంక్షలు తెలుపుకుంటూ సౌభ్రాతృభావాన్ని చాటుకున్నారు.

ఇస్లామిక్ పవిత్ర గ్రంథాల్లో విశేష ప్రాధాన్యత

బక్రీద్ పండుగకు ఇస్లామిక్ పవిత్ర గ్రంథాల్లో విశేష ప్రాధాన్యత ఉంది. హజరత్ ఇబ్రాహీం అల్లాహ్‌కు తన కుమారుడిని త్యాగం చేయడానికి సిద్ధపడ్డ త్యాగానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. అల్లాహ్‌ ఆ త్యాగాన్ని గుర్తించి, కుమారుడి స్థానంలో గొర్రెను పంపాడన్న నమ్మకం ఉంది. ఆ విధంగా ముస్లింలు బక్రీద్ రోజున జంతువులను బలి ఇస్తారు. ఆ మాంసాన్ని కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు, పేదలతో పంచుకుంటారు. ఇది త్యాగం, సేవ, సమానత్వానికి ప్రతీకగా భావిస్తారు.

రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

పండుగ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. ముస్లింలు సంతోషంగా, ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటూ మానవత్వం, శాంతి, సోదరత్వం సందేశాలను ప్రజలకు పంచుతున్నారు. ముఖ్య నేతలు దేశంలోని ముస్లిం సోదరులకు ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో ఐక్యతకు, సహనానికి బక్రీద్ ఒక ప్రతీకగా నిలుస్తోంది.

Read Also : DSC : ఏపీలో తొలిరోజు డీఎస్సీకి ఎంతమంది హాజరయ్యారంటే?

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.