हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Babri Masjid Issue: బంగాల్​లో టెన్షన్ టెన్షన్

Sushmitha
Telugu News: Babri Masjid Issue: బంగాల్​లో టెన్షన్ టెన్షన్

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఎంసీ బహిష్కృత ఎమ్మెల్యే హుమాయున్ కబీర్, బాబ్రీ మసీదు (Babri Masjid issue) కూల్చివేత జరిగిన తేదీన (డిసెంబర్ 6న) అదే తరహా మసీదు నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి సిద్ధమవడమే అందుకు ప్రధాన కారణం. ఇది మతపరంగా అత్యంత సున్నితమైన అంశం కావడంతో, పోలీసులు, ఆర్ఏఎఫ్ (RAF), మరియు కేంద్ర బలగాలు ముర్షిదాబాద్‌తో పాటు జాతీయ రహదారి 12కి ఇరువైపులా మోహరించి హై సెక్యూరిటీని ఏర్పాటు చేశాయి. బెల్దంగా, రాణినగర్, NH-12కి వెళ్లే అన్ని రహదారులను కవర్ చేసే విధంగా బలగాలు పహారా కాస్తున్నాయి.

Read Also: Redmi 15C: మార్కెట్లో కొత్త ఫీచర్స్ తో రెడ్ మీ 5జీ

కలకత్తా హైకోర్టు (Calcutta High Court) ఈ కార్యక్రమాన్ని నిలువరించాలంటూ దాఖలైన పిల్‌పై విచారణ చేపట్టింది. మత ఘర్షణలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ, మసీదు శంకుస్థాపన విషయంలో తాము కలగజేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, శాంతి భద్రతలను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు, పోలీసులు శుక్రవారం రాత్రి కబీర్ బృందంతో మాట్లాడటానికి ప్రయత్నించారు. మరోవైపు, బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ కూడా రెచ్చగొట్టే ప్రకటనలు, పుకార్లకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Babri Masjid Issue
Babri Masjid Issue Tension in Bengal

భారీ ఏర్పాట్లు: లక్షలాది మంది హాజరవుతారని కబీర్ ప్రకటన

ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉండే ముర్షిదాబాద్ జిల్లాలో (Murshidabad) మసీదు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని, ఇది తమ మతపరమైన హక్కు మరియు స్థానికుల డిమాండ్ అని హుమాయున్ కబీర్ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి లక్షలాది మంది హాజరవుతారని ఆయన స్పష్టం చేశారు.

పార్టీ ఆదేశాలను ఉల్లంఘించి సున్నిత అంశాన్ని తెరపైకి తెచ్చినందుకు టీఎంసీ ఇటీవల హుమాయున్ కబీర్‌ను సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో, కబీర్ డిసెంబర్ ఆఖర్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, అలాగే కొత్త పార్టీ పెడతానని ప్రకటించారు.

శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు:

  • వేదిక: జాతీయ రహదారి-12 వెలుపల వరి పొలాల్లో భారీ వేదికను నిర్మించారు.
  • భోజనాలు: ముర్షిదాబాద్‌ కు చెందిన ఏడు క్యాటరింగ్ ఏజెన్సీలు షాహీ బిర్యానీని తయారు చేయడానికి ఒప్పందం చేసుకున్నాయి. ఆహార ఖర్చులే దాదాపు రూ. 30 లక్షలకు పైగా ఉంటాయని, మొత్తం బడ్జెట్ రూ. 70 లక్షలకు చేరే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.
  • విదేశీ అతిథులు: సౌదీ అరేబియా నుంచి మత ప్రభోదకులు ప్రత్యేక కాన్వాయ్‌లో వస్తారని నిర్వాహకులు తెలిపారు.
  • వాలంటీర్లు: దాదాపు 3,000 మంది వాలంటీర్లు పనుల్లో నిమగ్నమయ్యారు.

ఈ కార్యక్రమం శనివారం ఉదయం 10 గంటలకు ఖురాన్ పారాయణంతో ప్రారంభమై, మధ్యాహ్నం శంకుస్థాపన వేడుక, మధ్యాహ్నం 2 గంటలకు భోజనాలతో కొనసాగనుంది.

టీఎంసీ నుంచి ‘సంహతి దివస్’ (ఐక్యతా దినోత్సవం) ప్లాన్

అదే శనివారం నాడు, అధికార టీఎంసీ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా సంహతి దివస్ (ఐక్యతా దినోత్సవం) ను జరపాలని సిద్ధమైంది. ఈ కార్యక్రమం ద్వారా మత సామరస్య సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ర్యాలీలకు ప్లాన్ చేసింది. ఈ సందర్భంగా అన్ని స్కూల్స్, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవును కూడా ప్రకటించారు. హుమాయున్ కబీర్ శంకుస్థాపన కార్యక్రమం కూడా శనివారమే నిర్వహించనుండడం రెండు పార్టీల మధ్య వ్యూహాత్మక పోటీకి నిదర్శనంగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870