భారతదేశంలోని ప్రముఖ హిందూ తీర్థయాత్రలలో అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra) కు విశిష్ట స్థానం ఉంది. హిమాలయ పర్వతాల్లో సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో గల పవిత్ర గుహలోని మంచులింగం దర్శనార్థం దేశం నలుమూలల నుండి భక్తులు వేలాదిగా తరలివస్తారు. ఈ ఏడాది (2025) యాత్ర జూలై 2న ప్రారంభమై (Starting on July 2nd) , 36 రోజుల పాటు కొనసాగనుంది. శ్రావణ పౌర్ణమి రోజైన ఆగస్టు 9న యాత్ర ముగియనుంది.

యాత్ర ప్రారంభం – భక్తుల ఉత్సాహం వెల్లువలా
ఈసారి యాత్ర ఘనంగా ప్రారంభమైంది. గురువారం ఉదయం బల్తాల్, పహల్గామ్ బేస్ క్యాంపుల (Pahalgam Base Camp) నుంచి యాత్రికుల తొలి బృందాలు బయలుదేరాయి. 5,246 మంది భక్తులతో కూడిన రెండో బృందం జమ్మూలోని భగవతి నగర్ యాత్రి నివాస్ నుంచి ప్రత్యేక భద్రతా కాన్వాయ్ల నడుమ కశ్మీర్ లోయకు బయలుదేరింది. అంతకుముందు, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా (Governor Manoj Sinha) బుధవారం యాత్రను అధికారికంగా ప్రారంభించారు.
భద్రత పరంగా అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు
ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra)కు భద్రత పట్ల అధికారులు అత్యంత గంభీరంగా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఈసారి అధికారులు కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా చర్యలు చేపట్టారు. భారత సైన్యం, పారామిలటరీ బలగాలతో పాటు అదనంగా 180 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను (CAPF) మోహరించారు. డ్రోన్లు, CCTV కెమెరాలు, RFID ఆధారిత ట్రాకింగ్ వ్యవస్థలు అమలులో ఉన్నాయి.
యాత్రికుల కోసం మెరుగైన సదుపాయాలు
భద్రతతోపాటు, యాత్రికుల సౌకర్యాలకూ ప్రభుత్వం పెద్దపీట వేసింది. తాత్కాలిక ఆసుపత్రులు, మెడికల్ క్యాంపులు, ఎంబులెన్స్లు యాత్ర మార్గంలో అందుబాటులో ఉన్నాయి. పానీ, భోజనం, బస వంటి ప్రాథమిక అవసరాల కోసం అనేక శిబిరాలు ఏర్పాటు చేశారు. యాత్రికులు తప్పనిసరిగా భద్రతా కాన్వాయ్లలోనే ప్రయాణించాలని, ఒంటరిగా వెళ్లవద్దని అధికారులు కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర గుహకు భక్తులు పహల్గామ్ లేదా బల్తాల్ మార్గాల గుండా చేరుకోవచ్చు.
భక్తుల స్పందన – తృప్తి, ధన్యత
వచ్చిన భక్తులు ఈసారి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయని భక్తులు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా, భారత సైన్యం తమకు పూర్తి భద్రతా భరోసా కల్పిస్తోందని, వారి అండతోనే తాము నిర్భయంగా యాత్ర చేయగలుగుతున్నామని పలువురు యాత్రికులు తెలిపారు. ఒకప్పుడు ఉగ్రదాడుల భయంతో తక్కువ మంది వచ్చేవారని, కానీ ఇప్పుడు ప్రభుత్వం కల్పించిన భద్రతతో పెద్ద సంఖ్యలో యాత్రకు వస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. అయితే, ఈ ఏడాది భద్రతా కారణాల దృష్ట్యా హెలికాప్టర్ సేవలను నిలిపివేశారు. ఈ యాత్ర శ్రావణ పౌర్ణమి (రక్షా బంధన్) రోజైన ఆగస్టు 9న ముగియనుంది.
Read also: Narendra Modi: ప్రధాని మోదీకి ఘనా అత్యున్నత జాతీయ పురస్కారం