Dam height issue : కృష్ణా నదిపై నిర్మితమైన ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపుపై మరోసారి వివాదం చెలరేగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వ్యతిరేకించడంపై కర్ణాటక డిప్యూటీ సీఎం D. K. Shivakumar అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆలమట్టి డ్యాం ఎత్తును 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచే ప్రణాళికపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని ఆయన తెలిపారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం ప్రాజెక్టు పనులు కొనసాగేందుకు సహకరించాలని కోరారు.
Read Also: Pawan Kalyan: ఈ నెల 19న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్?

ఈ ప్రాజెక్టు కోసం కర్ణాటక ప్రభుత్వం 1.33 లక్షల ఎకరాల భూమి సేకరణకు నిర్ణయం తీసుకున్నట్లు శివకుమార్ గుర్తుచేశారు. భూముల ధరలు పెరుగుతున్నందున భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించామని చెప్పారు.
అదే సమయంలో 2010లో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ప్రకారం కర్ణాటకకు 177 టీఎంసీల నుంచి 330 టీఎంసీల వరకు నీటి వినియోగానికి అనుమతి ఉందని ఆయన వివరించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై రూ.20,000 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో జోక్యం చేసుకోవడం సరైంది కాదని పేర్కొంటూ, కేంద్రం వెంటనే స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: