నాడు భారత స్వాతంత్య్ర సంగ్రామం లో పాల్గొనని వాళ్లు ఇప్పుడు వందేమాతరం గురించి, ఆ గీతం విలువల గురించి మాట్లాడుతున్నారని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) విమర్శించారు. లోక్సభలో వందేమాతరంపై చర్చలో పాల్గొన్న అఖిలేష్.. అధికార బీజేపీ నేతలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. వందేమాతరం జాతీయ గేయమని, ఆ గేయాన్ని ఒకరి నమ్మకాలను ఇతరులపై రుద్దే సాధనంగా వినియోగించడం కరెక్టు కాదని అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) వ్యాఖ్యానించారు. వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇవాళ లోక్సభలో చర్చ చేపట్టారు. వందేమాతర గీతం స్ఫూర్తిని ప్రతిఒక్కరూ అనుసరించాలని, స్వాతంత్య్ర పోరాటం సందర్భంగా ఈ గీతం ప్రజలను ఒక్కటి చేసిందని అన్నారు.
Read Also: http://Vande Mataram 150 years : డిసెంబర్ 8న లోక్సభలో ‘వందే మాతరం’పై చర్చకు ప్రధాని మోదీ శ్రీకారం…

ఇవాళ కొన్ని విచ్ఛిన్నకర శక్తులు దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం వందేమాతరం గీతాన్ని వాడుకుంటున్నాయని బీజేపీపై విమర్శలు చేశారు. వాళ్లు (బీజేపీ నేతలు) నాడు బ్రిటిష్ పాలకులు పాటించిన ‘విభజించు.. పాలించు’ పాలసీనే అనుసరిస్తున్నారని ఆరోపించారు.
అఖిలేష్ యాదవ్ డిగ్రీ?
ఆయన రాజస్థాన్లోని ధోల్పూర్లోని ధోల్పూర్ మిలిటరీ స్కూల్లో విద్యనభ్యసించారు, తరువాత భారతదేశంలోని కర్ణాటకలోని మైసూర్ విశ్వవిద్యాలయంలో సివిల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. అఖిలేష్ యాదవ్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయం నుండి పర్యావరణ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీని కూడా పొందారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: