Telugu news: Accident: కొత్త జంట ప్రాణం తీసిన ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్

Read Time:  1 min
Accident
Accident
FONT SIZE
GET APP

కర్ణాటక(Karnataka)లో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం వెళ్లిన ఒక జంట రోడ్డు ప్రమాదం(Accident)లో మృతి చెందారు. ఈ ఘటన క్రమంలో కాబోయే పెళ్లి జంట తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయి, కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

Read also: కుక్కకాటు భయాందోళన.. రోజుకు 300 మందికి పైగా ఆస్పత్రికి క్యూ

Accident
Pre-wedding photoshoot that took the lives of a newlywed couple

హనుమాన్ హట్టి–ముస్తూరు గ్రామాల యువజంట రోడ్డు ప్రమాదంలో మృతి

కొప్పల్ తాలూకా హనుమాన్ హట్టి గ్రామానికి చెందిన 26 ఏళ్ల కరియప్పకు, కరతగి తాలూకా ముస్తూరు గ్రామానికి చెందిన కవితతో ఈ నెల 20న వివాహం జరగాల్సి ఉండేది. వివాహ ఏర్పాట్లతో కుటుంబాలు తలపడుతున్న సమయంలో, ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వెళ్లిన జంట బైక్‌పై తిరిగి వస్తుండగా, ప్రమాదం(Accident) జరిగింది.

ముందు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో, ఎదురుగా వచ్చిన మరో లారీ జంటను ఢీ కొట్టింది. బైక్ సుమారు నుజ్జునుజ్జుగా కరిగిపోయింది. కవిత అక్కడికక్కడే మృతి చెందగా, కరియప్ప ఆసుపత్రికి తరలిస్తుండగా చివరి శ్వాస విడిచాడు. పెళ్లి పీటలకు చేరాల్సిన జంట ప్రాణాలు కోల్పోవడంతో రెండు గ్రామాల్లో తీవ్ర విషాదం వ్యాపింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.