ఇరాన్ retaliatory దాడుల నేపథ్యంలో భారత ఎయిర్లైన్స్ ఎయిరిండియా (Air India) అప్రమత్తమైంది. గల్ఫ్ (Gulf) ప్రాంతం మీదుగా వెళ్లే అన్ని విమాన సర్వీసులను తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రయాణికుల భద్రతే తమకు ప్రాధాన్యమని సంస్థ స్పష్టం చేసింది.పశ్చిమాసియా దేశాల మీదుగా నడిచే విమానాలతో పాటు, ఉత్తర అమెరికా తూర్పు తీరానికి వెళ్లే, అలాగే యూరప్కు వెళ్లే సర్వీసులను కూడా నిలిపివేసినట్లు ఎయిరిండియా వెల్లడించింది. ఇప్పటికే బయలుదేరిన కొన్ని విమానాలను తిరిగి మళ్లించారు. భారత్ నుంచి టేకాఫ్ అయిన కొన్ని విమానాలను ఇతర మార్గాల్లో వెనక్కి పంపినట్లు వివరించారు.
ఇతర ఎయిర్లైన్స్ కూడా అప్రమత్తమే
ఎయిరిండియాతో పాటు గల్ఫ్ మీదుగా వెళ్లే మరోవైపు విమానాలన్నీ అంతే జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. కొచ్చి నుంచి దోహాకు వెళ్లాల్సిన విమానం మస్కట్కు మళ్లించబడింది. కన్నూర్ నుంచి బయలుదేరిన మరో విమానం తిరిగి రావాల్సి వచ్చింది. భద్రతకు మించిన ప్రాధాన్యత లేదని ఈ చర్యలు సూచిస్తున్నాయి.దుబాయ్, దోహా, బహ్రెయిన్, దామమ్, అబుదాబీ, కువైట్, తిబ్లిసీ వంటివి ఇండిగో కార్యకలాపాలకు ప్రధాన కేంద్రాలు. అయితే అక్కడి ఉద్రిక్తతల వల్ల ఇండిగో సేవలపైనా ప్రభావం తలెత్తింది. సంస్థ పరిస్థితిని గమనిస్తున్నట్లు తెలిపింది.
బహ్రెయిన్, కువైట్ గగనతలాలు తిరిగి ఓపెన్
తాత్కాలికంగా గగనతలాలను మూసిన కొన్ని దేశాలు దాన్ని తిరిగి తెరిచాయి. బహ్రెయిన్, కువైట్ మళ్లీ విమాన రాకపోకలుకు అనుమతించాయి. దుబాయ్ ఎయిర్పోర్టు కూడా కార్యకలాపాలను పునఃప్రారంభించిందని సమాచారం. అయినా కొన్ని ఫ్లైట్లు రద్దు కాగా, మరికొన్ని ఆలస్యంగా నడవనున్నాయని తెలుస్తోంది.
Read Also : Iran-Israel War : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ముగిసింది – ట్రంప్