అమరావతిలో భూములు కొనసాగిస్తామన్న నారాయణ

అమరావతిలో భూములు కొనసాగిస్తామన్న నారాయణ

అమరావతిలో భూములు కొనసాగిస్తామన్న నారాయణ ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ సమావేశం జరిగింది.ఇందులో ముఖ్యంగా రాజధాని అమరావతిలో భూకేటాయింపులపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఈ సమావేశానంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ గతంలో 131 సంస్థలకు భూమి కేటాయించామని,వాటిలో 31 సంస్థలకు కేటాయింపులను కొనసాగిస్తున్నామని వెల్లడించారు.అంతేకాకుండా కొన్ని సంస్థలకు భూకేటాయింపులో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అందులో భాగంగా రెండు సంస్థలకు కేటాయించిన భూముల లొకేషన్‌ను మార్చినట్లు తెలిపారు.మరో 16 సంస్థలకు భూకేటాయింపు విస్తరణపై చర్చించామని, నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వివరించారు.అలాగే 13 సంస్థలకు కేటాయించిన భూములను రద్దు చేయాలని నిర్ణయించామని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా మంత్రి నారాయణ గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు.అమరావతి విషయంలో మూడుకోణాల్లో రాజకీయాలు ఆడినట్లు ఆరోపించారు.

Advertisements
అమరావతిలో భూములు కొనసాగిస్తామన్న నారాయణ
అమరావతిలో భూములు కొనసాగిస్తామన్న నారాయణ

కక్షసాధింపు చర్యల కారణంగా అమరావతి అభివృద్ధి కుంటుపడిందని అయితే ప్రస్తుత ప్రభుత్వం రాజధాని అభివృద్ధికి కట్టుబడి ఉందని మంత్రి నారాయణ తెలిపారు.భవిష్యత్తులో మరిన్ని సంస్థలను ఆకర్షించి, అమరావతిని వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ స్థాయిలో చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, మంత్రులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు.భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా మార్చేందుకు కృషి చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.

Related Posts
టీటీడీకి నూతన ఈవో, ఏఈవో?
ttd temple

తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచంలో కోట్లాది మంది భక్తులులకు ఆరాధ్యదైవం. టీటీడీ ప్రక్షాళన కోట్లాది మంది భక్తులు విశ్వసించే తిరుమల బాధ్యత టీటీడీ పై ఉంది. Read more

Nadeendla Manohar: రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు : నాదెండ్ల మనోహర్
Nadeendla Manohar రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు నాదెండ్ల మనోహర్

Nadeendla Manohar: రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు : నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లను కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించిందని రాష్ట్ర ఆహార, పౌర Read more

తెలుగు రాష్ట్రాలకు నిధులు రిలీజ్ చేసిన కేంద్రం
telugu states

ఐదు రాష్ట్రాలకు మొత్తంగా రూ.1,554.99 కోట్లు విడుదల కేంద్ర ప్రభుత్వం విపత్తు సహాయ నిధుల కింద ఐదు రాష్ట్రాలకు మొత్తంగా రూ.1,554.99 కోట్లు విడుదల చేసింది. ఈ Read more

ఏపీలో పెరిగిన సముద్ర తీరం
Raised sea coast in AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సముద్రతీరం పొడవు పెరిగినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజా నివేదికలో వెల్లడించింది. 1970లో ఉన్న లెక్కల ప్రకారం రాష్ట్ర సముద్రతీరం పొడవు 973.7 Read more

×