Nara lokesh facilitates organ donation of brain dead woman in guntur

Lokesh: మంత్రి లోకేష్ చొరవతో గ్రీన్‌ ఛాలెల్‌ ద్వారా గుండె తరలింపు

Lokesh: ఏపీ మంత్రి నారా లోకేశ్ చొరవతో గుంటూరులోని రమేష్ ఆసుపత్రి నుంచి తిరుపతికి గ్రీన్ ఛానల్ ద్వారా ఒక మహిళ గుండెను విజయవంతంగా తరలించారు. చెరుకూరి సుష్మ అనే మహిళ గుంటూరు రమేష్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యింది. ఆస్పత్రి వైద్యులు ఆమె కుటుంబసభ్యులకు అవయవదానంపై అవహాన కల్పించారు. దీంతో ఆమె కుటుంబసభ్యులు అవయవదానం చేయడానికి అంగీకరించారు. దీంతో ఆసుపత్రి వైద్యులు మంత్రి నారా లోకేష్‌ను సంప్రదించారు. అవయవాలు తరలించి మరికొందరికి ప్రాణదానం చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఆస్పత్రి వైద్యుల అభ్యర్థనకు మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు.

మంత్రి లోకేష్ చొరవతో గ్రీన్‌ ఛాలెల్‌

సొంత ఖర్చుతో ప్రత్యేక విమానం ఏర్పాటు

బ్రెయిన్‌డెడ్‌ అయిన మహిళ గుండెను తరలించేందుకు తన సొంత ఖర్చుతో ఏర్పాట్లు చేయించారు. గుండెను తరలించేందుకు వీలుగా లోకేష్ సొంత ఖర్చుతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేయించారు. అలాగే బ్రెయిన్ డెడ్ అయిన మహిళ గుండెను తిరుపతిలోని ఆస్పత్రికి చేరే వరకూ గ్రీన్‌ఛానల్‌ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. లోకేష్ ఆదేశాలతో గుంటూరు నుంచి తిరుపతికి గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేసి.. గుండెను తరలించారు. గుంటూరు నుంచి తొలుత గన్నవరం విమానాశ్రయానికి తరలించిన అధికారులు.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి గుండెను తరలించారు. రేణిగుంట నుంచి గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి తిరుపతి ఆస్పత్రికి తరలించారు.

వారికి గుండె అందించడం బాధలోనూ సంతోషాన్ని ఇస్తోంది

మరోవైపు తన భార్య అకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడినట్లు బ్రెయిన్ డెడ్ అయిన మహిళ భర్త శ్రీనివాస్ తెలిపారు. వెంటనే రమేష్ ఆస్పత్రికి తీసుకొచ్చామని వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆమె కోమాలోకి వెళ్లారని అన్నారు. ఆ తర్వాత బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు వైద్యులు చెప్పారని.. అవయవదానం గురించి వివరించారన్నారు. ఆస్పత్రి యాజమాన్యం, మంత్రి నారా లోకేష్ సహకారంతో తిరుపతిలో ఉన్న వారికి గుండె అందించడం బాధలోనూ సంతోషాన్ని ఇస్తోందని అభిప్రాయపడ్డారు.

Related Posts
ఫిబ్రవరిలో ఫ్రాన్స్ టూరు కు ప్రధాని మోదీ
PM Modi to visit France in February

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరిలో ఫ్రాన్స్ పర్యటనకు వెళ్ళనున్నారని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ప్రకటించారు. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో ఫ్రాన్స్‌లో జరిగే Read more

ఎన్నికల సంఘంపై మండిపడ్డ కాంగ్రెస్
ఎన్నికల సంఘంపై మండిపడ్డ కాంగ్రెస్

ఎన్నికల సంఘంపై మండిపడ్డ కాంగ్రెస్, పారదర్శకత తగ్గిపోవడం పై తీవ్ర విమర్శలు భారత ప్రభుత్వం కొన్ని ఎన్నికల నియమాలలో మార్పులు చేర్చింది, దీనివల్ల పబ్లిక్‌కు కొన్ని ఎలక్ట్రానిక్ Read more

Jagan Mohan Reddy: వైసీపీ కార్యకర్తలకు నా అభినందనలు
Jagan Mohan Reddy: వైసీపీ కార్యకర్తలకు నా అభినందనలు

వైసీపీ విజయం: స్థానిక సంస్థల ఉపఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఉపఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకొని ఘన Read more

యమునా నదిలో కేజ్రీవాల్‌ పోస్టర్!
యమునా నదిలో కేజ్రీవాల్ పోస్టర్!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో యమునా నది ఒక కీలక అంశంగా మారింది, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై మరోసారి దాడి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *