हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

జైలు నుంచి విడుదలైన నందిగాం సురేష్

Sukanya
జైలు నుంచి విడుదలైన నందిగాం సురేష్

వైఎస్‌ఆర్‌సీపీ నేత, మాజీ పార్లమెంట్ సభ్యుడు నందిగం సురేష్‌ జైలు నుండి విడుదలయ్యారు. వెలగపూడికి చెందిన మరియమ్మ అనే మహిళ హత్య కేసులో గుంటూరు కోర్టు వైఎస్‌ఆర్‌సీపీ నేత నందిగం సురేష్‌కు బెయిల్ మంజూరు చేసింది. 145 రోజుల తర్వాత ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు. కోర్టు బెయిల్ ఆమోదించినప్పటికీ, ష్యూరిటీలు సమర్పించడంలో జాప్యం కారణంగా నిన్న ఆయనను విడుదల చేయలేదు. అన్ని లాంఛనాలు పూర్తి చేసుకున్న అనంతరం ఈ రోజు ఉదయం జైలు అధికారులు ఆయనను విడుదల చేశారు. కోర్టు ₹10,000 పూచీకత్తు బాండ్‌ను సమర్పించాలని ఆదేశించింది.

జైలు నుంచి విడుదలైన నందిగాం సురేష్

2020 డిసెంబర్‌లో అమరావతిలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో మరియమ్మ అనే మహిళ మృతి చెందింది. హింస సమయంలో రాళ్లు రువ్వడంతో ఆమె గాయాలకు గురై మరణించింది. ఆమె కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి నందిగం సురేష్‌ను 78వ నిందితుడిగా పేర్కొన్నారు. నందిగం సురేష్‌కు చిన్న ఆరోగ్య సమస్య ఉందని సమాచారం, కాలర్‌బోన్ (కండరాలు) నొప్పితో బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ ఆరోగ్య సమస్య కారణంగా బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతేడాది అక్టోబర్ 7న పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. 145 రోజుల తర్వాత ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870