Nagababu : జగన్ పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు పిఠాపురంలో జరిగిన జయకేతనం సభ సందర్భంగా జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వైసీపీ అధ్యక్షుడు జగన్ పై ఆయన చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి. జగన్ వ్యాఖ్యలు అసలు సీరియస్గా తీసుకోవాల్సినవేం కావు, అవి వినగానే నవ్వొస్తోంది అంటూ నాగబాబు తన ప్రసంగంలో జగన్ భవిష్యత్తుపై ఆసక్తికరంగా స్పందించారు. “జగన్ ఎన్నో కలలు కనేశాడు, ఇంకో 20 ఏళ్లు అలాగే కలలు కంటూనే ఉంటాడు. అతనికి నా చిన్న సలహా –కలలు కనడం కొనసాగించు! అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఏం జరుగుతుందో జగన్ మొన్నటి ఎన్నికల్లోనే చూశాడు. ప్రజలు వైసీపీని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు అని నాగబాబు అన్నారు.
పవన్ కల్యాణ్ లాంటి నాయకుడు తలిదండ్రులకే వరం!
పవన్ కల్యాణ్ నాయకత్వంపై నాగబాబు పొగడ్తల వర్షం కురిపించారు. పవన్ పుట్టినప్పుడు మా తల్లికి నొప్పి కూడా తెలియనివ్వలేదు, అలాగే ప్రజలకు మంచి చేసే నాయకుడిగా ఎదిగాడు. జనసేనాని లాంటి వ్యక్తి మనకు దొరకడం నిజంగా దేవుని ఆశీర్వాదం అని చెప్పారు. నాగబాబు మాట్లాడుతూ, పవన్ లాగా గొప్ప నాయకుడు కావడం అందరికీ సాధ్యం కాదు. కానీ, కనీసం ఆయన అనుచరుడైనా ఉండగలిగితే అది గొప్ప అదృష్టం అని అన్నారు. ఇప్పటికే పవన్ మరో రెండు, మూడు తరాల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. అంత vision ఉన్న వ్యక్తి పవన్ అని అన్నారు.
జనసేన ఎంఎల్సీ అవకాశం ఇచ్చిన పవన్కు కృతజ్ఞతలు!
పవన్ కల్యాణ్ నాకు ఎమ్మెల్సీగా అవకాసం ఇచ్చాడు. అది నా జీవితంలో గర్వించదగ్గ విషయం. జనసేన ఆవిర్భావ సభ వేదికగా పవన్కు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని నాగబాబు అన్నారు. పవన్ నిస్వార్థ స్వభావాన్ని గుర్తుచేస్తూ, దేవుడు అడిగితేనే వరాలు ఇస్తాడు, కానీ అడగకుండానే ప్రజలకు వరాలివ్వగలిగే మనిషి పవన్ కల్యాణ్ అని తెలిపారు.
పిఠాపురం విజయానికి పవన్, ప్రజలే అసలైన కారణం
పిఠాపురం ఎన్నికల ఫలితాలపై మాట్లాడుతూ, ఇక్కడ మనం ఘన విజయం సాధించబోతున్నామనే విషయం పవన్కు ముందే తెలుసు. కానీ, ఈ విజయానికి పవన్, ప్రజలే అసలైన కారణం. ఇక్కడ ఎవరు వ్యక్తిగతంగా విజయం సాధించామనుకున్నా, అది వారి భ్రమ మాత్రమే అని నాగబాబు స్పష్టం చేశారు.
జనసేన నాయకత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. రాష్ట్రానికి మార్పు తీసుకురావడానికి పవన్ కల్యాణ్ మున్ముందు మరిన్ని ఆలోచనలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో జగన్ లాంటి వాళ్లకు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా స్థానం ఉండదు! అంటూ నాగబాబు తన ప్రసంగాన్ని ముగించారు.
జయకేతనం సభలో నాగబాబు పవన్ కల్యాణ్ నాయకత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. జగన్పై వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూ, ఇంకో 20 ఏళ్లు కలలు కనడమే మిగిలింది అని ఎద్దేవా చేశారు. జనసేన పిఠాపురంలో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జనసేన మద్దతుతో రాష్ట్రంలో రాజకీయ మార్పు తప్పదని ప్రజలు గ్రహించారు అని అన్నారు.