'mysterious deaths'

వింత వ్యాధితో 17 మంది మృతి..ఎక్కడంటే..!

జమ్ము కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా బుధాల్ గ్రామంలో వింత వ్యాధి కలకలం సృష్టిస్తోంది. ఈ వ్యాధి కారణంగా రెండు కుటుంబాల్లో ఇప్పటివరకు 17 మంది మృతి చెందారు. ఇంకా 11 మందికి ఈ వ్యాధి సోకినట్లు స్థానిక వర్గాలు తెలిపారు. ఈ వ్యాధి పై ప్రస్తుతం పరిశోధనలు చేస్తున్నారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీ (GMC)లో ఈ వ్యాధితో బాధపడుతున్న రోగుల కోసం ప్రత్యేక చికిత్సా కేంద్రం ఏర్పాటు చేశారు. అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించి చికిత్స అందించేందుకు వైద్య బృందాలు కృషి చేస్తున్నాయి.

Advertisements

ఈ వ్యాధి చిన్నారులపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని స్థానిక ఎమ్మెల్యే ఇక్బాల్ వెల్లడించారు. కళ్లముందే పిల్లలు ప్రాణాలు కోల్పోతున్న దృశ్యాలను తల్లిదండ్రులు చూడలేక, తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ విషాదకర పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం చొరవ తీసుకుని వెంటనే అత్యవసర చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎమర్జెన్సీ తరలింపుల కోసం ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఇక్బాల్ కోరారు. రోగులను మెరుగైన వైద్యం అందించే కేంద్రాలకు తరలించేందుకు ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు.

ప్రస్తుతం ఈ వింత వ్యాధి వివరాలు వెలుగులోకి రానప్పటికీ, అధికారులు దీని మూలాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. వ్యాధి లక్షణాలు, వ్యాప్తి పద్ధతులపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి పూర్తి స్థాయి సహాయం అందిస్తే, మరిన్ని ప్రాణ నష్టం నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Related Posts
రాహుల్ గాంధీ పై శివసేన ధ్వజం
రాహుల్ గాంధీ పై శివసేన ధ్వజం

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ముంబై పర్యటనపై శివసేన నాయకుడు సంజయ్ నిరుపమ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకుడిలా కాకుండా ఒక యూట్యూబర్‌లాగా Read more

దేవర సక్సెస్..ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్
devara 11 day

దేవర సక్సెస్ నేపథ్యంలో ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మూవీ దేవర.. రిలీజ్ కు ముందు భారీ Read more

భర్త కిడ్నీ అమ్మి, ఆ డబ్బుతో పారిపోయిన భార్య
sad man

ఓ మహిళ తన భర్త కిడ్నీ అమ్మాలని ఒత్తిడి చేసి, ఆ డబ్బుతో ప్రియుడితో కలిసి పారిపోయింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో చోటుచేసుకుంది. సంక్రైల్‌కు Read more

PM Modi: దేశసేవ కోసం స్మృతి మందిర్‌ ప్రేరణను పొగడుతూ మోదీ కీలక వ్యాఖ్యలు
PM Modi: దేశసేవ కోసం స్మృతి మందిర్‌

ప్రధాని మోదీ సందర్శించిన RSS స్మృతి మందిర్ - దేశసేవ పట్ల ఉత్సాహపూర్వక సందేశం ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ నాగ్‌పూర్‌లోని RSS (రాష్ట్రీయ స్వయం సేవక్ Read more

Advertisements
×