Myanmar earthquake..Death toll crosses 100

Earthquake: మయన్మార్‌ భూకంపం .. 100 దాటిన మృతుల సంఖ్య

Earthquake: మయన్మార్‌ భారీ భూకంపం ధాటికి విలవిల్లాడుతోంది. వరుస భూకంపాల తీవ్రతకు మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు అక్కడ 103 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. మరోవైపు, థాయ్‌లాండ్‌లో నలుగురు మృతిచెందగా.. 50 మంది గాయపడినట్లు సమాచారం. అలాగే, చైనాలోనూ పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. కూలిన ఎత్తైన భవనాల కింద చిక్కుకొని హాహాకారాలు చేస్తున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

image
image

ఎత్తైన వంతెన కూలడంతో 90 మంది గల్లంతు

మయన్మార్‌లోని నేపిడాలో వెయ్యి పడకల ఆస్పత్రి, మాండలే నగరంలో ఐకానిక్‌ వంతెన, పలుచోట్ల ఎత్తైన ఆలయాలు, గోపురాలు భూకంప తీవ్రతకు కుప్పకూలాయి. బ్యాంకాక్‌లోని నిర్మాణంలో ఉన్న ఎత్తైన వంతెన కూలడంతో 90 మంది గల్లంతైనట్లు థాయ్‌లాండ్‌ రక్షణ మంత్రి ప్రకటించారు. శుక్రవారం రిక్టర్‌ స్కేలుపై 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి మయన్మార్‌, థాయ్‌లాండ్‌లోని పలు భవంతులు కుప్పకూలిపోయాయి. మయన్మార్‌ రాజధాని నగరం నేపిడాలో ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి.

భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు

బ్యాంకాక్‌లో భూప్రకంపనలతో ఓ భారీ భవంతి పైఅంతస్తులో ఉన్న స్విమ్మింగ్‌ పూల్‌లోని నీరు కిందకు పడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో థాయ్‌లాండ్‌లో ప్రధాని షినవత్ర అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. బ్యాంకాక్‌లో మెట్రో, రైలు సేవలను నిలిపివేశారు.

Related Posts
చరిత్రలో నిలిచిపోయే రోజు..ఈరోజు – సీఎం రేవంత్
telangana thalli cm revanth

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీఎస్‌ను 'టీజీ'గా మార్చామని , ఈ Read more

సుప్రీంకోర్టు తదుపరి ఉన్నత న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా
Justice Sanjiv Khanna as the next senior judge of the Supreme Court

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు తదుపరి ఉన్నత న్యాయమూర్తిగా సీనియర్ జడ్జి జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును..ప్రస్తుత సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సిఫార్సు చేశారు. దీంతో తదుపరి సీజేగా Read more

కారు కొంటానన్న ట్రంప్..ఎలోన్ మస్క్ హ్యాపీ
ట్రంప్ ఎఫెక్ట్ తో వరల్డ్ నెంబర్ వన్ కుబేరుడిగా ఎలాన్ మస్క్

అమెరికా అధ్యక్షుడి కొత్త విధానాలు ప్రపంచం మొత్తంని రోజురోజుకో ఒక కొత్త మలుపు తిప్పుతుంది. సుంకాల సుంచి మొదలైన ఈ రచ్చ ఇప్పుడు దేశాల దేశాల్లో చర్చనీయాంశంగా Read more

అసెంబ్లీలో నిద్రపోయిన సీఎం రేఖా
rekha gupta sleeping

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా అసెంబ్లీలో నిద్రపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సభలో సభ్యులు చర్చలు జరుపుతున్న సమయంలో ఆమె కునుకు తీశారు. ఈ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *