చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫ్యాన్స్కు మరోసారి ఆనందించాల్సిన సమయం వచ్చింది.ఎందుకంటే ధోనీ మళ్లీ కెప్టెన్గా బరిలోకి దిగనున్నాడు. ఐతే ఇది ఇప్పుడే ఒక వదంతి కాదు – జట్టు వర్గాల నుంచి వచ్చిన అధికారిక సమాచారం ప్రకారం, రేపు ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగే మ్యాచ్లో ఎంఎస్ ధోనీ జట్టుకు నేతృత్వం వహించనున్నాడు.ప్రస్తుతం జట్టును నడిపిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ గాయంతో ఆటకు దూరం కానున్నాడు.రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్ సమయంలో ఎడమ మోచేతికి తీవ్ర గాయం కావడంతో అతడు ఫిట్నెస్ లేకుండా పోయినట్టు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో యాజమాన్యం మళ్లీ ధోనీకే కెప్టెన్సీ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.సొంత మైదానమైన చెపాక్ స్టేడియంలో రేపు జరిగే మ్యాచ్లో CSK ఢిల్లీ క్యాపిటల్స్ను ఢీకొనబోతోంది.ఇప్పటి వరకు చెన్నై మూడు మ్యాచులు ఆడింది.

అందులో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది.పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అనుభవజ్ఞుడు అయిన ధోనీ మళ్లీ కెప్టెన్ అవ్వడం జట్టుకు ఎంతో మేలు చేసే అవకాశం ఉంది.ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్న విషయం ఏంటంటే – ధోనీకి స్టేడియంలో మళ్లీ “కెప్టెన్ కూల్”గా చూడాలని ఉంది.ప్రతి చెన్నై అభిమానికి ఇది ఒక ఎమోషన్ లాంటిది.ఎంఎస్ ధోనీ అంటేనే చెన్నై సూపర్ కింగ్స్ గుర్తొస్తుంది. అతను సీఎస్కేకు ఐదు ఐపీఎల్ ట్రోఫీలు అందించాడు. గతేడాది మాత్రం తన పదవిని స్వచ్ఛందంగా వదులుకొని రుతురాజ్ను తన వారసుడిగా ప్రకటించాడు.ఆ సమయంలో అభిమానులు బాధపడినా, రుతురాజ్ మీద ధోనీకి ఉన్న నమ్మకం స్పష్టంగా కనిపించింది. కానీ ఇప్పుడు గాయం కారణంగా తాత్కాలికంగా అయినా ధోనీ మళ్లీ కెప్టెన్ అవ్వడం అభిమానులకు పెద్ద పండుగలా మారింది.ధోనీ మళ్లీ కెప్టెన్ అవుతున్నారన్న వార్త బయటికొచ్చిన దగ్గరనుంచి ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మొత్తం ధోనీ ఫోటోల్లో మునిగిపోయింది. “తల మళ్లీ వచ్చాడు”, “ఓపెనింగ్ మన ధోనీదే” అంటూ హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి.ఫ్యాన్స్ భాషలో చెప్పాలంటే “దేవుడు తిరిగి తన స్థానంలోకి వచ్చాడు!” అన్నట్టు వాతావరణం ఉంది. చెన్నై స్టేడియంలో రేపు మ్యాచ్ టైంలో ధోనీకి వచ్చే చీర్స్ ఊహించడమే కష్టం.రేపటి మ్యాచ్పై చూపే అభిమానుల ఫోకస్.
ధోనీ కెప్టెన్గా ఎలా లీడ్ చేస్తాడు?
గాయపడ్డ రుతురాజ్ స్థానంలో ఎవరు ఓపెనర్గా వస్తారు?
బౌలింగ్ అటాక్లో మార్పులు ఉంటాయా?
ధోనీ వ్యూహాలు మ్యాచ్ను మలుపుతిప్పుతాయా?
ఇలా రేపటి మ్యాచ్పై అభిమానులు కాకిపిల్లలా ఎదురుచూస్తున్నారు.
ఐపీఎల్లో కెప్టెన్సీ అనేది కేవలం ఓ బాధ్యత కాదు.ధోనీ లాంటి ఆటగాడి చేతిలో ఆ బాధ్యత ఉంటే,ఆ జట్టు ఆటే మారిపోతుంది.స్ట్రాటజీ, ప్లేయర్లకు మోటివేషన్, ఫీల్డ్ సెటింగ్ – అన్నింటినీ ధోనీ నిశబ్దంగా చేయగలడు.అందుకే అభిమానులు ఇప్పటికీ ధోనీ పేరునే జపిస్తుంటారు. అతని ప్రెజెన్స్తో జట్టులో కొత్త ఉత్సాహం వస్తుంది.ధోనీ కెప్టెన్సీ చేస్తూ బరిలోకి దిగితే, ఢిల్లీ క్యాపిటల్స్ కచ్చితంగా కాస్త గట్టిగానే ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎంఎస్డీ ఓసారి స్ట్రాటజీ పెట్టేశాడు అంటే అది విజయానికి అడ్డుపడదు.