బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ (BRS leaders KTR), హరీశ్ రావు మళ్లీ తెలంగాణ భావోద్వేగాన్నిసెంటిమెంట్ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) మండిపడ్డారు. ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఈ బాగోతాలకు మోసపోవద్దని హెచ్చరించారు.చామల విమర్శల తూటాలు కేటీఆర్పై సూటిగా పడ్డాయి. కేటీఆర్కు సీఎం రేవంత్ స్థాయి ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. “ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమే. సవాల్ విసరాల్సింది ప్రతిపక్ష నేత కేసీఆర్, కేటీఆర్ కాదు,” అని తెలిపారు.కేటీఆర్కు నిజంగా హిమ్మత ఉంటే తన తండ్రి నుంచి ప్రతిపక్ష నేత హోదా తెచ్చుకోమన్నారు. తల్లీ కొడుకుల రాజకీయం ఇక తెలంగాణకు పనికిరాదని చామల వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ పాలనను దారుణంగా విమర్శించిన ఎంపీ
గత బీఆర్ఎస్ పాలనపై చామల తీవ్రంగా మండిపడ్డారు. “మిగులు బడ్జెట్తో అధికారంలోకి వచ్చిన కేసీఆర్, రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పులలో ముంచారు,” అన్నారు. ఆ అప్పుల్ని అభివృద్ధికి వినియోగించి ఉంటే తెలంగాణ చక్కగా ఎదిగేది అని ఆవేదన వ్యక్తం చేశారు.
కృష్ణా జలాల వినియోగంపై హక్కుతో చెప్పిన మాట
కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన 299 టీఎంసీల నీటిని పాత ప్రభుత్వం పూర్తిగా వాడలేకపోయిందన్నారు. “కానీ మేము అధికారంలోకి వచ్చాక ఒక్క ఏడాదిలోనే 280 టీఎంసీలు వినియోగించాం,” అని గర్వంగా చెప్పారు.
బనకచర్ల ప్రాజెక్టుపై స్పష్టం
బనకచర్ల ప్రాజెక్టును తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదన్నారు. “ఆరు నూరైనా ఆ ప్రాజెక్టును అడ్డుకుంటాం,” అని ధీటుగా స్పష్టం చేశారు.
ఉద్యోగాల భర్తీపై కాంగ్రెస్ హస్తం
కేవలం ఆరేళ్లు కాదు, కొన్ని నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు భర్తీ చేసిందని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం నోటిఫికేషన్ల పేరిట ప్రజలను మోసం చేసిందని తీవ్ర విమర్శలు చేశారు.