తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక భారీ కాంబినేషన్ సెట్స్పైకి రాబోతుంది. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో కొత్త చిత్రం రూపుదిద్దుకోబోతోంది. ఈ సినిమాకు ‘రౌడీ జనార్ధన’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. దిల్ రాజు స్వయంగా ఈ ప్రాజెక్ట్పై భారీ నమ్మకంతో ఉన్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 11వ తేదీన మూవీ లాంచ్ జరిగే అవకాశం ఉంది. అనంతరం అక్టోబర్ 16న ముంబైలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఈ చిత్రానికి ‘ రాజావారు రాణిగారు ’ ఫేమ్ రవి కిరణ్ కోలా దర్శకత్వం వహించనుండటం మరో విశేషం. ఆయన ప్రత్యేకమైన నేరేషన్ స్టైల్, ఎమోషనల్ ఎంగేజ్మెంట్కి పేరుగాంచారు.
Sammakka-Sarakka University : సమ్మక్క-సారక్క యూనివర్సిటీ లోగో ఆవిష్కరణ
ఈ సినిమా (Rowdy Janardhana)లో హీరోయిన్గా కీర్తి సురేశ్ ఎంపికైనట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. విజయ్ దేవరకొండ–కీర్తి సురేశ్ కాంబినేషన్ ఇది మొదటిసారి కావడంతో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. దిల్ రాజు బ్యానర్లో వస్తున్నందున ఈ ప్రాజెక్ట్పై అంచనాలు మరింత పెరిగాయి. ‘రౌడీ జనార్ధన’ కథ యాక్షన్, ఎమోషన్, డ్రామా కలయికగా ఉండనుందని, ఇది విజయ్ ఇమేజ్కు కొత్త మలుపు తిప్పే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాతో విజయ్ మరలా బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నట్లు అభిమానులు విశ్వసిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఇటీవల విజయ్ దేవరకొండ ఒక పెద్ద ప్రమాదం నుండి అదృష్టవశాత్తు క్షేమంగా బయటపడ్డారు. పుట్టపర్తి నుండి హైదరాబాద్కు వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కార్ ప్రమాదానికి గురైంది. అయితే, విజయ్కు ఎలాంటి గాయాలు కాకపోవడం అభిమానులకు ఊరట కలిగించింది. ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో గాడ్ బ్లెస్ విజయ్ ”, “ స్టే సేఫ్ అన్నా” అంటూ అభిమానులు సందేశాలు వెల్లువెత్తించారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/