సినీ నటి, నిర్మాత రేణూ దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో, అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. భవిష్యత్తులో తాను సన్యాసం తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. జీవితంలో డబ్బుకంటే విలువైనది మనసు ప్రశాంతత, ఆధ్యాత్మికత అని ఆమె చెప్పింది. తాను ఎప్పుడూ భౌతిక సుఖాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని, అవసరమైనప్పుడు మాత్రమే జాగ్రత్తగా ఖర్చు పెడతానని తెలిపింది. ఈ మాటలతో ఆమె మనసులోని ప్రశాంతత, ఆత్మసాక్షాత్కారం పట్ల ఉన్న ఆకాంక్ష బయటపడింది.
Today Rasi Phalalu : రాశి ఫలాలు – 22 అక్టోబర్ 2025 Horoscope in Telugu
రేణూ దేశాయ్ మాట్లాడుతూ, జీవితంలోని ప్రతి దశలో మనిషి అంతర్ముఖంగా మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తాను ఆధ్యాత్మికతను ఎంతో విలువైన అంశంగా భావిస్తానని, అదే మనిషిని నిజమైన అర్థంలో ఎదగనిస్తుందని చెప్పారు. గడచిన కొన్ని సంవత్సరాలుగా ధ్యానం, యోగా, ఆధ్యాత్మిక పుస్తక పఠనం వంటి వాటిపై ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు తెలిపారు. తన జీవితం క్రమంగా ఆధ్యాత్మిక దిశగా మారుతోందని ఆమె వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె సన్యాసం గురించి చేసిన ప్రస్తావన అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది.

ఇక గతంలో రేణూ దేశాయ్ రెండో పెళ్లి గురించి కూడా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె వ్యాఖ్యలు పూర్తిగా భిన్న దిశలో ఉన్నట్లు కనిపిస్తోంది. వ్యక్తిగత జీవితం, ఆధ్యాత్మిక సాధన, కుటుంబ బాధ్యతల మధ్య సమతుల్యత సాధించడం తన లక్ష్యమని తెలిపారు. సినీ కెరీర్ నుంచి కొంత దూరంగా ఉన్నప్పటికీ, రేణూ దేశాయ్ తన ఆలోచనలతో, స్ఫూర్తిదాయక జీవన విధానంతో అభిమానుల హృదయాలను తాకుతున్నారు. సన్యాసం అనే నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది కాలమే నిర్ణయించాలి కానీ, ఆమె ఆధ్యాత్మిక వైఖరి ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/