టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ ( Manchu Manoj) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబంలో జరిగిన సంఘటనలపై హృదయవిదారక వ్యాఖ్యలు చేశారు. తన అన్న మంచు విష్ణు(Manchu Vishnu)తో ఉన్న విభేదాలు, కుటుంబంలో నెలకొన్న అసౌహార్య పరిస్థితులు ఇప్పటికే అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో మనోజ్ తొమ్మిదేళ్లుగా కుటుంబానికి దూరంగా జీవిస్తున్నామని తెలిపారు. తన భార్య ప్రారంభించిన బొమ్మల కంపెనీలో కథలు రాయడంతో పాటు, ఆర్ట్స్ వర్క్ చేస్తున్నానని చెప్పారు. ఆత్మగౌరవంతో జీవించడమే తన ప్రాధాన్యత అని పేర్కొన్నారు. అయితే అనుకోని కష్టాలు ఎదురయ్యాయని, అవి తాను ఊహించలేనివని, తన బాధను మీడియా ముందు చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు.
“నీకు ఏ సంబంధం?”
తన భార్య గర్భవతిగా ఉన్న సమయంలో కుటుంబ సభ్యులందరం మళ్లీ కలిసామని, కానీ అది ఒక్కరికి నచ్చలేదని మనోజ్ తెలిపారు. కళాశాలలో విద్యార్థులు తమ సమస్యలు చెప్పేందుకు తనను ఆశ్రయించారని, కానీ తాను మాట్లాడితే “నీకు ఏ సంబంధం?” అనే ప్రశ్న ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను, తన భార్యపై విద్యాసంస్థలో పనిచేసే వారిని ఉపయోగించి ఫిర్యాదులు చేయించారని ఆరోపించారు. సంబంధం లేని విషయాల్లో తన భార్యను లాగారని, అప్పుడు తన మనస్సు తట్టుకోలేక ముక్కలైందని బాధతో చెప్పారు. ఆమెకు అన్నీ తానేనని, కానీ తాను ఒక్క కేసు కూడా ఎవరి మీద పెట్టలేదని వివరించారు.
తండ్రి నేర్పిన నీతిని తానే పాటిస్తున్న
తన తండ్రి మోహన్ బాబుకు కాళ్లు పట్టుకుని, తన కుమార్తెను ఆయన ఒడిలో పెట్టాలని ఉందని భావోద్వేగంతో చెప్పారు. కానీ తాను చేయనిది ఒప్పుకుంటే, తన పిల్లలకు ఏం నేర్పిస్తున్నాననే సందేహం కలుగుతోందన్నారు. తండ్రి నేర్పిన నీతిని తానే పాటిస్తున్నానని, అందుకే తాము ముందుకు వెళ్లలేకపోతున్నామని తెలిపారు. తాము మళ్లీ ఒక్కటవాలని ప్రతిరోజూ దేవుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఈ సమస్యలు సృష్టించిన వారు తమ తప్పును ఓ రోజు తెలుసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also : Kavitha Letter : ఆ లేఖ రాసింది నేనే – కవిత క్లారిటీ