భారత సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన ‘బాహుబలి’ సిరీస్ మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో రూపొందిన ఈ గ్లోబల్ బ్లాక్బస్టర్, రెండు భాగాలను కలిపి ‘బాహుబలి – ది ఎపిక్’ పేరుతో తిరిగి విడుదలైంది. అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అప్రతిహత స్పందన లభించింది. విడుదలైన తొలి రోజే థియేటర్ల వద్ద భారీ క్యూలు కనిపించాయి. అభిమానులు బాహుబలి మంత్రంలో మళ్లీ మునిగిపోయారు.
Jogi Ramesh Arrest : జనార్దన్ వాంగ్మూలం మేరకే జోగి రమేశ్ అరెస్ట్!
సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా రీ-రిలీజ్ మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.19.6 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు అంచనా. అందులో దేశీయ మార్కెట్ నుంచి సుమారు రూ.12.95 కోట్లు, విదేశీ మార్కెట్ల నుంచి రూ.6.65 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ అనలిస్ట్లు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, కేరళ, కర్ణాటక, హిందీ బెల్ట్ ప్రాంతాల్లో కూడా ప్రేక్షకులు ఈ సినిమాకు అద్భుత స్పందన చూపారు. ముఖ్యంగా IMAX, 4K రీమాస్టర్ వెర్షన్లో చూపించిన విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ క్వాలిటీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.

‘బాహుబలి – ది ఎపిక్’ మళ్లీ విడుదల కావడం కేవలం కమర్షియల్ రీ-రిలీజ్ మాత్రమే కాదు, ఒక సాంస్కృతిక సంబరంగా మారింది. రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, కీరవాణి సంగీతం, ప్రభాస్, రాణా, అనుష్క, తమన్నా వంటి తారల నటన – ఇవన్నీ మళ్లీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. బాహుబలి సిరీస్కు ఉన్న క్రేజ్ ఎప్పటికీ తగ్గదనే విషయం ఈ వసూళ్లు మరోసారి రుజువు చేశాయి. నిపుణుల అంచనా ప్రకారం, వీకెండ్ కల్లా ఈ సినిమా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసే అవకాశం ఉంది. మొత్తానికి, “బాహుబలి” మళ్లీ బాక్సాఫీస్పై తన శక్తిని చాటింది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/