हिन्दी | Epaper
బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

Gaddar Awards : CM రేవంత్ అనుమతి తీసుకోని డైలాగ్ చెప్పిన అల్లు అర్జున్

Sudheer
Gaddar Awards : CM రేవంత్ అనుమతి తీసుకోని డైలాగ్ చెప్పిన అల్లు అర్జున్

హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా జరిగిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ (Gaddar Film Awards) వేడుక అట్టహాసంగా జరిగింది. సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరై ఈ వేడుకకు మరింత గ్లామర్‌ను అందించారు. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) స్వయంగా అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2: ది రూల్’ చిత్రంలో తన అద్భుతమైన నటనకు గాను ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. అలాగే నందమూరి బాలకృష్ణకు ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’ లభించింది.

అభిమానులకు ఈ అవార్డు అంకితం – అల్లు అర్జున్

అవార్డు అందుకున్న అనంతరం మాట్లాడిన అల్లు అర్జున్.. ఈ గౌరవం తన అభిమానులకే అంకితమని తెలిపారు. “ఈ అవార్డుకు కారణం పుష్ప చిత్ర దర్శకుడు సుకుమార్. అలాగే ‘పుష్ప 1’ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేయమని ప్రోత్సహించిన రాజమౌళి గారికి నా కృతజ్ఞతలు. ఇవే లేకపోతే ఈ స్థాయి గుర్తింపు సాధ్యపడేది కాదని” అన్నారు. “పుష్ప 2” చిత్రానికి ఇది మొదటి అవార్డు కావడంతో ఇది తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పారు. గద్దర్ అవార్డులు ప్రతీ సంవత్సరం జరగాలని ఆకాంక్షించారు.

పుష్ప డైలాగ్‌

అవార్డు వేడుకలో చివర్లో ప్రేక్షకులకు ఓ సినిమా డైలాగ్ చెప్పేందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనుమతి తీసుకున్నారు. వారు వెంటనే అనుమతించడంతో అల్లు అర్జున్ “నా బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా…” అంటూ పుష్ప 2 లోని శక్తివంతమైన డైలాగ్‌ను పంచుకున్నారు. ప్రేక్షకుల నుండి పెద్ద చప్పట్లతో స్పందన రావడంతో వేదికను జై తెలంగాణ, జై హింద్ నినాదాలతో ముగించారు. ఈ వేడుక సినిమాప్రియుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది.

Read Also : South Africa చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా…

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870