हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

Kavitha Letter : ఏపీ సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ

Sudheer
Kavitha Letter : ఏపీ సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha), ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడికి ఓ కీలక లేఖ రాసారు. 2014లో జరిగిన రాష్ట్ర విభజన అనంతరం ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలు చట్ట విరుద్ధంగా చీకటి ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో విలీనం చేయబడ్డాయని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశారని విమర్శించారు. భద్రాచలం రామాలయ ప్రాంతంలోని యటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

రామాలయ భూములపై ఆక్రమణల ఆందోళన

కవిత లేఖలో మరో ముఖ్య అంశంగా భద్రాచలం శ్రీరాముల వారి భూముల పరిరక్షణను ప్రస్తావించారు. పురుషోత్తపట్నం రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ భూములు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండటంతో, రామాలయానికి చెందిన భూములపై అక్రమ కబ్జాలు కొనసాగుతున్నాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కబ్జాలను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆలయ అధికారులు భౌతిక దాడులకు గురవుతున్నారని, ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని మసకబార్చేలా ఉన్నాయని ఆమె హెచ్చరించారు.

ప్రజల ఆవేదన, మానవతా దృష్టితో నిర్ణయం తీసుకోండి

విలీనమైన ఐదు గ్రామాల్లో ప్రజలు విద్య, వైద్యం, ఉపాధి వంటి ప్రాథమిక సేవలకు నానా ఇబ్బందులు పడుతున్నారని కవిత లేఖలో తెలిపారు. వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి సేవలు పొందాల్సిన పరిస్థితిలో ప్రజలు ఉన్నారని ఆమె వాపోయారు. భద్రాచలంలోని రాముల వారి ఆలయ పునాదులు మరియు అక్కడి ప్రజల ఆవేదనను గౌరవించి, మానవతా దృష్టితో తెలంగాణలో ఐదు గ్రామాల విలీనానికి చంద్రబాబు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, రాజకీయ లబ్దిని కాదని, రాముని భక్తులను కాపాడాలని ఆమె అభిప్రాయపడ్డారు.

Read Also : Adulterated Toddy: కల్తీ కల్లు ఘటనలో ఆరుగురికి చేరిన మృతుల సంఖ్య

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870